ట్యాంక్ బండ్ పై నిమర్జనం లేదు
- September 13, 2024
హైదరాబాద్: హై కోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నిమర్జనం లేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. గణేష్ నిమర్జనం కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపిన ఆయన మండపం నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ట్యాంక్ బండ్ మినహా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు లో నిమర్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయని సీపీ వెల్లడించారు.
ఇక ఇదే సమయంలో మిలాద్ ఉన్ నబీ ప్రోగ్రామ్ ఉన్నందున ముస్లిం మత పెద్దలతో సమన్వయం చేస్తున్నామన్నారు. అలాగే 17న పబ్లిక్ గార్డెన్ లో ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమం, పెరేడ్ గ్రౌండ్లో మరో కార్యక్రమం ఉందని సీపీ ప్రకటించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు పోలీసులకు సహరించి, నిబంధనలు అనుగుణంగా వ్యవహరించాలని కోరారు.
నిమజ్జనం ఇతర కార్యక్రమాల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపిన ఆయన హైదరాబాద్ సిటీ పరిధిలో 15 వేలు, ఇతర జిల్లాల నుంచి మరో 3 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని క్లారిటీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మరో 8 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారని తెలిపారు.
నిబంధనలు ఇవే..
* గణేష్ విగ్రహానికి ఒక వాహనాన్ని మాత్రమే అనుమతిస్తారు.
* విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్స్పీకర్ను అమర్చకూడదు.
* నిమజ్జనం రోజు వాహనాలపై DJతో కూడిన మ్యూజికల్ సిస్టమ్ను అనుమతించరు.
* రంగులు పిచికారీ చేయడానికి కాన్ఫెట్టీ గన్లను ఉపయోగించకూడదు.
* మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు లేదా మరేదైనా మత్తు పదార్థాలను కలిగి ఉన్న వ్యక్తులను విగ్రహాన్ని తీసుకువెళ్లే వాహనంలోకి అనుమతించరు.
* రహదారిపై వెళ్లేటప్పుడు వాహనం ట్రాఫిక్ను ప్రభావితం చేయకూడదు
* ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దు
* విగ్రహాన్ని తీసుకువెళ్లే వాహనం ఏదైనా ప్రార్థనా స్థలం దగ్గర లేదా ఇతర వాహనాలకు లేదా ట్రాఫిక్కు అంతరాయం కలిగించే రహదారిపై ఆగకూడదు.
* అప్పటి పరిస్థితిని బట్టి పోలీసు అధికారులు ఇచ్చే ఆదేశాలపై వాహనాల రాకపోకలు ఆధారపడి ఉంటాయి.
* ఊరేగింపులో ఎవరూ కర్రలు/కత్తులు, మారణాయుధాలు, మండే పదార్థాలు లేదా ఇతర ఆయుధాలను తీసుకెళ్లకూడదు.
* జెండాలు లేదా అలంకరణల కోసం ఉపయోగించే కర్రలు 2 అడుగుల పొడవు మించకూడదు.
* బాటసారులపై వెర్మిలియన్, కుంకుమ లేదా గులాల్ వేయవద్దు
* ఊరేగింపులో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు/ రెచ్చగొట్టే ప్రసంగాలు/ నినాదాలు లేదా రెచ్చగొట్టే సంకేతాలు లేదా బ్యానర్లు ఉపయోగించరాదు.
* ఏ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఇతర రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదు.
* ఊరేగింపు సమయంలో బాణసంచా కాల్చరాదు.
* పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలను పాటించండి.
* ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో, 100కి డయల్ చేసి తెలియజేయండి.
--వేణు పెరుమాళ్ల✍🏼(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









