ఆధార్ కార్డ్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం..
- September 14, 2024
న్యూ ఢిల్లీ: ఆధార్ కార్డ్ హోల్డర్స్ కు భారత విశిష్ట గుర్తింపు ప్రాదికార సంస్థ (UIDAI) మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనుండగా.. ఉడాయ్ ఆ గడువును మరోసారి పెంచుతూ ప్రకటించింది. ఈ మేరకు ఉడాయ్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. 2024 డిసెంబర్ 14వ తేదీ వరకు ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు గడువును పెంచింది. దీంతో ఆధార్ కార్డులో చిరునామా మార్పులు చేసుకోవాలనుకునే వారు డిసెంబర్ 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు.
ఉచిత సేవలు మై ఆధార్ (My Aadhaar) పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పెట్టిన తేదీ, చిరునామా, ఇతర వివరాల్లో తప్పులు నమోదైనా, మార్పులు చేయాలన్నా ఉచితంగా చేసుకోవచ్చు. ఉచిత గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్ డేట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









