ఆధార్ కార్డ్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం..
- September 14, 2024
న్యూ ఢిల్లీ: ఆధార్ కార్డ్ హోల్డర్స్ కు భారత విశిష్ట గుర్తింపు ప్రాదికార సంస్థ (UIDAI) మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనుండగా.. ఉడాయ్ ఆ గడువును మరోసారి పెంచుతూ ప్రకటించింది. ఈ మేరకు ఉడాయ్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. 2024 డిసెంబర్ 14వ తేదీ వరకు ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు గడువును పెంచింది. దీంతో ఆధార్ కార్డులో చిరునామా మార్పులు చేసుకోవాలనుకునే వారు డిసెంబర్ 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు.
ఉచిత సేవలు మై ఆధార్ (My Aadhaar) పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పెట్టిన తేదీ, చిరునామా, ఇతర వివరాల్లో తప్పులు నమోదైనా, మార్పులు చేయాలన్నా ఉచితంగా చేసుకోవచ్చు. ఉచిత గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్ డేట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







