సౌదీ నుంచి ఇండియా చేరుకున్నారు నిర్మల్ వాసి
- October 01, 2024
హైదరాబాద్: సీఎం రేవంత్ చొరవతో సౌదీ నుంచి ఇండియా చేరుకున్నారు నిర్మల్ వాసి. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రువ్వికి చెందిన రాథోడ్ నామదేవ్ అనే వ్యక్తి బతుకు తెరువు కోసం 5 నెలల క్రితం ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లాడు. కువైట్ లో హౌస్ కీపింగ్ పని అని చెప్పి నామదేవ్ ను సౌదీలో ఒంటెల కాపరిగా ఏజెంట్...పెట్టారు. అయితే ఏజెంట్ చిత్రహింసలు భరించలేక తనను ఎలాగైనా ఇండియా రప్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు రాథోడ్ నామదేవ్.
ఇక సెల్ఫీ వీడియోపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... రాథోడ్ నామదేవ్ ను ఇండియా రప్పించే చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. సీఎంఓ అధికారులు...సౌదీలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి రాథోడ్ నామదేవ్ ను ఇండియా రప్పించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి రాథోడ్ నామదేవ్ కుటుంభం ధన్యవాదాలు తెలిపారు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







