సౌదీ నుంచి ఇండియా చేరుకున్నారు నిర్మల్ వాసి
- October 01, 2024
హైదరాబాద్: సీఎం రేవంత్ చొరవతో సౌదీ నుంచి ఇండియా చేరుకున్నారు నిర్మల్ వాసి. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రువ్వికి చెందిన రాథోడ్ నామదేవ్ అనే వ్యక్తి బతుకు తెరువు కోసం 5 నెలల క్రితం ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లాడు. కువైట్ లో హౌస్ కీపింగ్ పని అని చెప్పి నామదేవ్ ను సౌదీలో ఒంటెల కాపరిగా ఏజెంట్...పెట్టారు. అయితే ఏజెంట్ చిత్రహింసలు భరించలేక తనను ఎలాగైనా ఇండియా రప్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు రాథోడ్ నామదేవ్.
ఇక సెల్ఫీ వీడియోపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... రాథోడ్ నామదేవ్ ను ఇండియా రప్పించే చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. సీఎంఓ అధికారులు...సౌదీలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి రాథోడ్ నామదేవ్ ను ఇండియా రప్పించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి రాథోడ్ నామదేవ్ కుటుంభం ధన్యవాదాలు తెలిపారు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్లైన్స్తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక
- ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
- రష్యా వీసా ఖర్చుల భారం లేకుండా ట్రిప్ ప్లాన్
- యూఏఈలో రేపటి వాతావరణం ప్రశాంతం
- ఆన్లైన్ క్లాసులు నిర్వహించండి..స్కూళ్లకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి
- భారత దేశవ్యాప్తంగా NEET పరీక్ష రద్దు..కేంద్రం సంచలన నిర్ణయం
- తమిళనాడులో సీఎం విజయ్ షణ్ముగంతో కీలక భేటీ









