గోవా రైల్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చ జెండా
- October 06, 2024
సికింద్రాబాద్: సికింద్రాబాద్–గోవా వెళ్లే రైలు ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని భోయి గూడా వైపు గల పదో నెంబర్ ప్లాట్ ఫారం పై నుండి గోవా రైలు సర్వీస్ ను ప్రారంభించారు..
తెలంగాణ రాజధానితో గోవా రాజధాని వాస్కో-డ-గామాతో మెరుగైన అనుసంధానం చేశారు. ఈ రైలు వారానికి రెండు రోజులు ఇరు మార్గాలలో నడపబడుతోంది. ప్రస్తుతం కర్నాటక మరియు గోవా ప్రాంతాలకు వెళ్లేందుకు తెలుగు వారికి ప్రయాణ సౌలభ్యాలు తక్కువగా ఉన్నాయి.
గోవా చేరుకోవడానికి గుంతకల్లు వద్ద ఉన్న ఇతర రైళ్లకు అనుసంధానించవలసిన లింక్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ రైలు అనుకూలమైన సమయాలతో సికింద్రాబాద్ నుండి ప్రత్యేకమైన రైలు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది..
ఈ కొత్త రైలు దాదాపు 854 కి.మీల దూరాన్ని దాదాపు 20 గంటలపాటు ఎగువ దిశలో మరియు 21 గంటల పాటు దిగువ దిశలో ప్రయాణం పూర్తిచేస్తుంది.. ఈ రైలు మార్గంలో ప్రత్యేకమైన చారిత్రక, పర్యాటక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఇతర ముఖ్యమైన నగరాలను కలుపుతూ, నూతన ప్రాంతాలనుంచి పెరిగిన ప్రయాణికులతో నిర్దిష్ట బంధాన్ని ఏర్పరుచు కోవడానికి అవకాశం కల్పిస్తుంది.. ఈ రైలు అత్యాధునిక ఎల్.ఎచ్.బి. కోచ్లతో ప్రవేశపెట్టబడి ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని మరియు ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







