టీమిండియా ఆల్రౌండ్ షో….తొలి టీ20లో బంగ్లా చిత్తు
- October 07, 2024
గ్వాలియర్: బంగ్లాదేశ్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. తొలుత బంతితో… ఆ తరువాత బ్యాట్ తో రఫ్పాడించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 127 పరుగులకే కుప్పకూలింది.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో మెహదీ హసన్ మిరాజ్ (35 నాటౌట్: 32 బంతుల్లో, మూడు ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఇక, స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా చెలరేగిపోయింది. ఓపెనర్ సంజు శాంసన్ (29), అభిషేక్ శర్మ (16), కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (29) ధనాధన్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. నితీశ్ కుమార్ రెడ్డి (16 నాటౌట్) రాణించగా.. హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) బెంగ్లా బౌలర్లను ఉతికి ఆరేశాడు. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- "చెక్ యువర్ హెల్త్" క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర









