టీమిండియా ఆల్రౌండ్ షో….తొలి టీ20లో బంగ్లా చిత్తు
- October 07, 2024
గ్వాలియర్: బంగ్లాదేశ్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. తొలుత బంతితో… ఆ తరువాత బ్యాట్ తో రఫ్పాడించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 127 పరుగులకే కుప్పకూలింది.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో మెహదీ హసన్ మిరాజ్ (35 నాటౌట్: 32 బంతుల్లో, మూడు ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఇక, స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా చెలరేగిపోయింది. ఓపెనర్ సంజు శాంసన్ (29), అభిషేక్ శర్మ (16), కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (29) ధనాధన్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. నితీశ్ కుమార్ రెడ్డి (16 నాటౌట్) రాణించగా.. హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) బెంగ్లా బౌలర్లను ఉతికి ఆరేశాడు. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది.
తాజా వార్తలు
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్







