రామ్ పోతినేని, మహేష్ బాబు పచ్చిగొల్ల, #RAPO22 అనౌన్స్మెంట్
- October 13, 2024
ఉస్తాద్ రామ్ పోతినేని తన 22వ మూవీని దసరా పండగ సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో అలరించిన మహేష్ బాబు పచ్చిగొల్ల ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్కి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
#RAPO22 రామ్ కెరీర్కు సిగ్నిఫికెంట్ ఎడిషన్ కానుంది. ఇటీవల యాక్షన్-ఓరియెంటెడ్ పాత్రలతో అలరించిన రామ్ ఈ మూవీలో ఓ యూనిక్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. రామ్ స్టైలిష్ మేకోవర్లో కనిపించనున్నారని అనౌన్స్మెంట్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రం ఇంపాక్ట్ ఎమోషన్స్ ని ఎక్స్ ఫ్లోర్ చేయనుంది. రామ్ కెరీర్లో ల్యాండ్మార్క్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది.
దర్శకుడు మహేష్ బాబు తన మునుపటి చిత్రాలలో హ్యుమర్, ఎమోషన్స్ బ్లెండ్ చేసి అలరించారు , అప్ కమింగ్ మూవీ కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మూవీ లైట్ హార్టెడ్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయనుంది.
నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు, ఇందులో ప్రముఖ నటీనటులు, టాప్ టెక్నీషియన్లు పని చేయనున్నారు.
త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.
తారాగణం: రామ్ పోతినేని
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: మహేష్ బాబు పచ్చిగొల్ల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







