ఒమన్ పోస్టల్ సర్వీసెస్ చట్టంలో కీలక మార్పులు..!!
- October 22, 2024
మస్కట్: తపాలా సేవలను నియంత్రించే చట్టానికి రెగ్యులేటరీ అథారిటీ (TRA) కీలక మార్పులు చేసింది. తపాలా సేవల రంగంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధితో పోటీ పడేందుకు నిర్ణయం తీసుకుంది. ఇది లబ్ధిదారులకు అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఇ-కామర్స్ టెక్నాలజీలను తాజాగా ప్రవేశపెట్టారు. ముసాయిదా నియంత్రణ చట్టం..తపాలా సేవలను అందించడానికి అవసరమైన లైసెన్స్లను పొందేందుకు ఆసక్తి ఉన్న పార్టీల నిబంధనలు, షరతులను నిర్దేశించింది. ఆధునిక పరిణామాలకు అనుగుణంగా అనువైన నియంత్రణ వాతావరణాన్ని నెలకొల్పడం, లబ్ధిదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు (SMEలు) సాధికారత కల్పించడం, స్థానిక సంస్థలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలను కొత్తగా తీసుకొచ్చినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







