అనసూయ వెర్సస్ మంచు లక్ష్మి.! దీపావళికి ‘మోత మోగిపోద్ది’.!
- October 22, 2024
అనసూయ, మంచు లక్ష్మి కాంబినేషన్లో సినిమా ఏమైనా రాబోతోందా.? అనుకుంటున్నారా.? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. నిజానికి అనసూయ సినిమాలతో చాలా బిజీగా వున్న సంగతి తెలిసిందే.
అలాగే, మంచు లక్ష్మి ‘ఆది పర్వం’ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ‘యక్షిణి’ అనే వెబ్ సిరీస్తో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించింది.
అసలు మ్యాటర్ ఏంటంటే, అనసూయ, మంచు లక్ష్మి కలిసి ఓ బుల్లితెర స్పెషల్ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు. దీపావళికి ప్రసారం కాబోయే ఈ ప్రోగ్రాంలో అనసూయ ‘అను బాంబ్’గా, మంచు లక్ష్మి ‘లక్ష్మి బాంబ్’ అంటూ రెండు టీమ్లుగా విడిపోయి తమ తమ టీమ్స్ కోసం నువ్వా నేనా.? అంటూ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు.
తాజాగా ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన ప్రోమో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ప్రోగ్రాంలో మంచు లక్ష్మి వెర్సస్, అనసూయ మధ్య డైలాగులు మాస్ కా దాస్ అనేలా హోరెత్తిపోతున్నాయి. దాంతో, ఈ ప్రోగ్రామ్పై ఆసక్తి పెరిగింది.
గతంలోనూ ఈ తరహా ప్రోగ్రామ్స్ బుల్లితెరపై వీక్షకుల్ని ఎంటర్టైన్ చేసేవి. తాజాగా దీపావళికి రాబోయే ఈ ‘మోత మోగిపోద్ది’ ప్రోగ్రామ్ ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయనుందో తెలియాలంటే దీపావళి వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







