అనసూయ వెర్సస్ మంచు లక్ష్మి.! దీపావళికి ‘మోత మోగిపోద్ది’.!
- October 22, 2024
అనసూయ, మంచు లక్ష్మి కాంబినేషన్లో సినిమా ఏమైనా రాబోతోందా.? అనుకుంటున్నారా.? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. నిజానికి అనసూయ సినిమాలతో చాలా బిజీగా వున్న సంగతి తెలిసిందే.
అలాగే, మంచు లక్ష్మి ‘ఆది పర్వం’ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ‘యక్షిణి’ అనే వెబ్ సిరీస్తో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించింది.
అసలు మ్యాటర్ ఏంటంటే, అనసూయ, మంచు లక్ష్మి కలిసి ఓ బుల్లితెర స్పెషల్ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు. దీపావళికి ప్రసారం కాబోయే ఈ ప్రోగ్రాంలో అనసూయ ‘అను బాంబ్’గా, మంచు లక్ష్మి ‘లక్ష్మి బాంబ్’ అంటూ రెండు టీమ్లుగా విడిపోయి తమ తమ టీమ్స్ కోసం నువ్వా నేనా.? అంటూ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు.
తాజాగా ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన ప్రోమో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ప్రోగ్రాంలో మంచు లక్ష్మి వెర్సస్, అనసూయ మధ్య డైలాగులు మాస్ కా దాస్ అనేలా హోరెత్తిపోతున్నాయి. దాంతో, ఈ ప్రోగ్రామ్పై ఆసక్తి పెరిగింది.
గతంలోనూ ఈ తరహా ప్రోగ్రామ్స్ బుల్లితెరపై వీక్షకుల్ని ఎంటర్టైన్ చేసేవి. తాజాగా దీపావళికి రాబోయే ఈ ‘మోత మోగిపోద్ది’ ప్రోగ్రామ్ ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయనుందో తెలియాలంటే దీపావళి వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







