అనసూయ వెర్సస్ మంచు లక్ష్మి.! దీపావళికి ‘మోత మోగిపోద్ది’.!
- October 22, 2024
అనసూయ, మంచు లక్ష్మి కాంబినేషన్లో సినిమా ఏమైనా రాబోతోందా.? అనుకుంటున్నారా.? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. నిజానికి అనసూయ సినిమాలతో చాలా బిజీగా వున్న సంగతి తెలిసిందే.
అలాగే, మంచు లక్ష్మి ‘ఆది పర్వం’ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ‘యక్షిణి’ అనే వెబ్ సిరీస్తో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించింది.
అసలు మ్యాటర్ ఏంటంటే, అనసూయ, మంచు లక్ష్మి కలిసి ఓ బుల్లితెర స్పెషల్ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు. దీపావళికి ప్రసారం కాబోయే ఈ ప్రోగ్రాంలో అనసూయ ‘అను బాంబ్’గా, మంచు లక్ష్మి ‘లక్ష్మి బాంబ్’ అంటూ రెండు టీమ్లుగా విడిపోయి తమ తమ టీమ్స్ కోసం నువ్వా నేనా.? అంటూ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు.
తాజాగా ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన ప్రోమో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ప్రోగ్రాంలో మంచు లక్ష్మి వెర్సస్, అనసూయ మధ్య డైలాగులు మాస్ కా దాస్ అనేలా హోరెత్తిపోతున్నాయి. దాంతో, ఈ ప్రోగ్రామ్పై ఆసక్తి పెరిగింది.
గతంలోనూ ఈ తరహా ప్రోగ్రామ్స్ బుల్లితెరపై వీక్షకుల్ని ఎంటర్టైన్ చేసేవి. తాజాగా దీపావళికి రాబోయే ఈ ‘మోత మోగిపోద్ది’ ప్రోగ్రామ్ ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయనుందో తెలియాలంటే దీపావళి వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









