రష్యా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ
- October 22, 2024
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ‘బ్రిక్స్’ 16వ సదస్సులో పాల్గొనేందుకు రష్యా బయలుదేరారు. కజాన్ నగరంలో జరుగుతున్న ఈ సమ్మిట్లో, ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో కూడా చర్చలు జరుపనున్నారు.
కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్య ఆసియాలోని పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశం చాలా కీలకంగా మారింది. ఇతర బ్రిక్స్ సభ్య దేశాల నాయకులతో మోడీ చేసే ద్వైపాక్షిక చర్చలు, అంతర్జాతీయ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, వివిధ విభాగాలలో సమన్వయాన్ని పెంచేందుకు అవకాశాలను కల్పిస్తాయి. ఈ శిఖరాగ్ర సమావేశం, దేశాల మధ్య స్థిరమైన సంబంధాలను నిర్మించడానికి, ప్రపంచ వ్యాప్తంగా ప్రశ్నలపై సమాన దృష్టిని సాధించడానికి ఒక వేదికగా ఉంటుంది.
మరోవైపు బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాలంటూ ప్రధాని మోడీకి పుతిన్ ప్రత్యేక ఆహ్వానం పంపారు. కాగా ఈ ఏడాది ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడం ఇది రెండవసారి. జూలైలో నెలలో మాస్కోలో జరిగిన 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి కూడా ప్రధాని హాజరయ్యారు. ఆ పర్యటనలో పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతేకాదు రష్యా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ను అందుకున్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







