రష్యా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ
- October 22, 2024
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ‘బ్రిక్స్’ 16వ సదస్సులో పాల్గొనేందుకు రష్యా బయలుదేరారు. కజాన్ నగరంలో జరుగుతున్న ఈ సమ్మిట్లో, ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో కూడా చర్చలు జరుపనున్నారు.
కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్య ఆసియాలోని పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశం చాలా కీలకంగా మారింది. ఇతర బ్రిక్స్ సభ్య దేశాల నాయకులతో మోడీ చేసే ద్వైపాక్షిక చర్చలు, అంతర్జాతీయ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, వివిధ విభాగాలలో సమన్వయాన్ని పెంచేందుకు అవకాశాలను కల్పిస్తాయి. ఈ శిఖరాగ్ర సమావేశం, దేశాల మధ్య స్థిరమైన సంబంధాలను నిర్మించడానికి, ప్రపంచ వ్యాప్తంగా ప్రశ్నలపై సమాన దృష్టిని సాధించడానికి ఒక వేదికగా ఉంటుంది.
మరోవైపు బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాలంటూ ప్రధాని మోడీకి పుతిన్ ప్రత్యేక ఆహ్వానం పంపారు. కాగా ఈ ఏడాది ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడం ఇది రెండవసారి. జూలైలో నెలలో మాస్కోలో జరిగిన 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి కూడా ప్రధాని హాజరయ్యారు. ఆ పర్యటనలో పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతేకాదు రష్యా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ను అందుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









