రష్యా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ
- October 22, 2024
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ‘బ్రిక్స్’ 16వ సదస్సులో పాల్గొనేందుకు రష్యా బయలుదేరారు. కజాన్ నగరంలో జరుగుతున్న ఈ సమ్మిట్లో, ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో కూడా చర్చలు జరుపనున్నారు.
కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్య ఆసియాలోని పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశం చాలా కీలకంగా మారింది. ఇతర బ్రిక్స్ సభ్య దేశాల నాయకులతో మోడీ చేసే ద్వైపాక్షిక చర్చలు, అంతర్జాతీయ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, వివిధ విభాగాలలో సమన్వయాన్ని పెంచేందుకు అవకాశాలను కల్పిస్తాయి. ఈ శిఖరాగ్ర సమావేశం, దేశాల మధ్య స్థిరమైన సంబంధాలను నిర్మించడానికి, ప్రపంచ వ్యాప్తంగా ప్రశ్నలపై సమాన దృష్టిని సాధించడానికి ఒక వేదికగా ఉంటుంది.
మరోవైపు బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాలంటూ ప్రధాని మోడీకి పుతిన్ ప్రత్యేక ఆహ్వానం పంపారు. కాగా ఈ ఏడాది ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడం ఇది రెండవసారి. జూలైలో నెలలో మాస్కోలో జరిగిన 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి కూడా ప్రధాని హాజరయ్యారు. ఆ పర్యటనలో పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతేకాదు రష్యా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ను అందుకున్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







