రష్యా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ
- October 22, 2024
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ‘బ్రిక్స్’ 16వ సదస్సులో పాల్గొనేందుకు రష్యా బయలుదేరారు. కజాన్ నగరంలో జరుగుతున్న ఈ సమ్మిట్లో, ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో కూడా చర్చలు జరుపనున్నారు.
కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్య ఆసియాలోని పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశం చాలా కీలకంగా మారింది. ఇతర బ్రిక్స్ సభ్య దేశాల నాయకులతో మోడీ చేసే ద్వైపాక్షిక చర్చలు, అంతర్జాతీయ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, వివిధ విభాగాలలో సమన్వయాన్ని పెంచేందుకు అవకాశాలను కల్పిస్తాయి. ఈ శిఖరాగ్ర సమావేశం, దేశాల మధ్య స్థిరమైన సంబంధాలను నిర్మించడానికి, ప్రపంచ వ్యాప్తంగా ప్రశ్నలపై సమాన దృష్టిని సాధించడానికి ఒక వేదికగా ఉంటుంది.
మరోవైపు బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాలంటూ ప్రధాని మోడీకి పుతిన్ ప్రత్యేక ఆహ్వానం పంపారు. కాగా ఈ ఏడాది ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడం ఇది రెండవసారి. జూలైలో నెలలో మాస్కోలో జరిగిన 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి కూడా ప్రధాని హాజరయ్యారు. ఆ పర్యటనలో పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతేకాదు రష్యా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ను అందుకున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!