ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికీకరణ చట్టం.. ఉల్లంఘనలకు భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- October 23, 2024
దోహా: ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాలను స్థానికీకరించడంపై చట్టాన్ని ఉల్లంఘించిన సంస్థలు లేదా వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, QR1,000,000 వరకు జరిమానా విధించనున్నట్లు న్యాయ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. చట్టంలోని ఆర్టికల్ (11) ప్రకారం.. నిర్ణీత వ్యవధిలో ఉల్లంఘనను సరిచేసుకోని సంస్థల లావాదేవీలను 3 నెలల కాలానికి రద్దు చేస్తారు. ఆర్టికల్ (12) ప్రకారం.. మోసపూరిత విధానాలకు పాల్పడే వారికి 3 సంవత్సరాల జైలుశిక్షతోపాటు QR1,000,000కు జరిమానా విధించనున్నట్లు మంత్రిత్వశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. లోకలైజేషన్ చట్టం ప్రకారం.. అందుబాటులో ఉన్న ఉద్యోగాల గురించి తెలియజేయకపోవడం, నియమించిన వారి డేటాను అధికారులకు అందించకపోవడం లాంటి ఉల్లంఘనలకు పాల్పడితే మొదటిసారి ఉల్లంఘన జరిగినప్పుడు QR10,000, రెండవసారి జరిగినప్పుడు QR 20,000, మూడోసారి జరిగితే QR30,000 జరిమానా విధించబడుతుంది. అదేవిధంగా పునరావాసం, శిక్షణా ప్రణాళికకు కట్టుబడి ఉండని పక్షంలో మొదటి సారి పెనాల్టీ QR50,000, రెండవ ఉల్లంఘనకు QR75,000, మూడవసారి జరిగితే QR100,000 ఫైన్ విధిస్తారు. ఈ చట్టం అధికారిక గెజిట్లో ప్రచురించబడిన తేదీ నుండి ఆరు నెలల తర్వాత అమలులోకి వస్తుందని వెల్లడించింది. ఈ చట్టం ఖతార్ జాతీయ విజన్ 2030కి అనుగుణంగా తీసుకొచ్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









