BD1మిలియన్ ఫ్రాడ్.. కంపెనీ మేనేజర్ కు 5ఏళ్ల జైలుశిక్ష..!!
- October 23, 2024
మనామా: BD1 మిలియన్ కంటే ఎక్కువ అక్రమ లావాదేవీలలో మోసానికి పాల్పడిన మనీ ఎక్స్ఛేంజ్ కంపెనీ మేనేజర్కు ఐదేళ్ల జైలు శిక్షను కోర్టు ఆఫ్ కాసేషన్ సమర్థించింది. బాబ్ అల్ బహ్రెయిన్ బ్రాంచ్లో పనిచేసిన మేనేజర్.. నకిలీ ఖాతాదారుల పేర్లను ఉపయోగించి అంతర్జాతీయ నగదు బదిలీలను ప్రాసెస్ చేయడానికి BD5,100 లంచం అందుకున్నాడు. అతనికి సహకరించిన ఇద్దరు సహచరులకు మూడేళ్ల జైలుశిక్షతోపాటు బహిష్కరణ వేటు వేయనున్నారు. 2021 -23 మధ్య కాలంలో మేనేజర్ లంచాలు స్వీకరించారని, అతని విధులను ఉల్లంఘించారని, కంపెనీ సిస్టమ్లో తప్పుడు డేటాను నమోదు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అతని సహచరులపై లంచం, కుట్ర అభియోగాలు మోపారు. ఒక సహచరుడు BD4,500 లంచం కోసం సుమారు BD1 మిలియన్ మొత్తం 587 లావాదేవీలను చేసాడని, మరొకడు BD600 లంచం కోసం BD100,000 విలువైన 78 బదిలీలను ప్రాసెస్ చేశాడని గుర్తించారు. మోసపూరిత కార్యకలాపాలతో తాము పని చేస్తున్న సంస్థకు గణనీయమైన నష్టాన్ని కలిగించారని ఆరోపించారు. ప్రాథమిక కోర్టు తీర్పును హైకోర్టు గతంలో ధృవీకరించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









