రమదాన్‌ సందర్భంగా తనిఖీలు విస్తృతం

- June 22, 2016 , by Maagulf
రమదాన్‌ సందర్భంగా తనిఖీలు విస్తృతం



మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ అండ్‌ కామర్స్‌ (ఎంఇసి), పవిత్ర రమదాన్‌ మాసం సందర్భంగా మూడో వారం కూడా ఉధృతంగా ఇన్‌స్పెక్షన్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తోంది. దేశంలోని 1,400 ఔట్‌లెట్స్‌లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. యాక్సెసరీస్‌, క్లాత్స్‌, ఫుడ్‌ స్టఫ్‌, అలాగే కూరగాయలు పళ్ళ అమ్మకాలపై తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 2008 చట్టం 8 వ నిబంధనల ఉల్లంఘన కింద 19 విభాగాల్లో కేసులు నమోదు చేశారు. ధరలు పెంచడం, సరైన అనుమతులు లేకుండా విక్రయించడం, ఆయా వస్తువులపై నిర్ధారిత ధరల్ని పేర్కొనకపోవడం వంటివి గుర్తించారు అధికారులు. నిబందనల్ని ఉల్లంఘించినవారికి తీవ్రతను బట్టి 3000 ఖతారీ రియాల్స్‌ నుంచి 1 మిలియన్‌ ఖతారీ రియాల్స్‌ వరకు జరీమానా విధించే అవకాశం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com