డ్రాగన్ ఫ్రూట్ ను ఈ సమస్యలు ఉన్న వాళ్ళు తినకూడదు
- November 01, 2024
డ్రాగన్ ఫ్రూట్ ఇండియా మార్కెట్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా దొరుకుతుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు.ఇవి తినడానికి రుచిగా, మృదువుగా ఉంటాయి. ఇక, డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి మంచి పోషకాహారం. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్తో జెల్లీలు, సలాడ్స్, కేకులు, ఐస్ క్రీమ్లు, జ్యూసులు తయారు చేస్తారు. ఈ పండును పిటాయా, స్ట్రాబెర్రీ పియర్ అని కూడా పిలుస్తారు.
డ్రాగన్ ఫ్రూట్ పోషకాల స్టోర్ హౌస్ అని చెప్పాలి. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్, ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల.. మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంతేకాకుండా.. బి1, బి2, బి3 విటమిన్లు కూడా ఈ పండులో ఉన్నాయి. తరచూ మన డైట్లో డ్రాగన్ ఫ్రూట్ చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయంటున్నారు నిపుణులు. అయితే, ఎన్నో లాభాలున్నప్పటికీ.. ఈ పండు కొందరికి విషంతో సమానం. ఈ డ్రాగన్ ఫ్రూట్ ను కొందరు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఈ పండును ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
చర్మ సంబంధిత సమస్యలు, అలెర్జీతో బాధపడేవారు.. ఈ పండుకు దూరంగా ఉండాలి. ఈ పండు అతిగా తింటే అలర్జీ వచ్చే ప్రమాదముంది. ఈ పండు తినేటప్పుడు కొందరు.. తొక్క కూడా తింటారు. దీంతో.. దురదతో బాధపడతారు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణమవ్వడానికి కాస్త టైం పడుతుంది. దీంతో.. ఉబ్బరం సమస్యలు ఉన్నవారు.. దీనిని ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా తినడం వల్ల విరోచనాల సమస్య, డయేరియాకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు తినకపోవడమే బెటర్. మీకు తినాలిపిస్తే వైద్యుణ్ని సంప్రదించాలి. అంతేకాకుండా.. ఇతర వ్యాధులకు మందులు తీసుకుంటున్నవారు కూడా డ్రాగన్ ఫ్రూట్ తినే విషయంలో డాక్టర్ని సంప్రదిస్తే మంచిది.
- డి.వి.అరవింద్
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







