శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
- November 02, 2024
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది.బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఇద్దరి నుంచి రూ.7కోట్ల విలువైన డ్రగ్స్ ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకాక్ నుంచి వస్తున్న ప్రయాణికులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఇంటెలిజెన్స్ సిబ్బంది ఎయిర్పోర్ట్ డీఆర్ఐ అధికారులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని సోదాలు చేపట్టారు. సోదాల్లో వారి వద్ద సుమారు 7 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల