ఈ సమస్యలు ఉన్న వారు చపాతీలు తీసుకోకపోవడం మంచిది
- November 02, 2024
అన్నం బదులు చపాతీలు తినడం అనేది బరువు తగ్గడంలో ఒక భాగమైంది. దీని వల్ల కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి. బరువు కూడా తగ్గుతారని ఫీల్ అవుతారు. వీటిని రెగ్యులర్గా తింటే హెల్ప్ ఉంటుందని అనుకుంటారు. అయితే, వీటిని తినడం వల్ల బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయో.. మరోవైపు సమస్యలు కూడా అదే విధంగా ఉంటాయి. ఎక్కువగా చపాతీలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.దీంతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ చపాతీలు తీసుకోకపోవడమే మంచిదని కూడా చెబుతున్నారు.
చపాతీల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వీటిని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడం సంగతి పక్కన పెడితే మరింత బరువు పెరుగుతారు. ఇందులోని గ్లూటెన్ పరిమాణం కారణంగానే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరుగుతారు. వీటిలో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తతీసుకోవడం సీలియక్ డిసీజ్ అంటే కడుపుకి సంబంధించిన సమస్యలొస్తాయి. దీని వల్ల అసిడిటీ, మలబద్ధకం, జీర్ణ సమస్యలొస్తాయి. దీనికి కారణం రోటీలు తిన్నప్పుడు వాత సమస్య పెరగడమే. కాబట్టి, జీర్ణ సమస్యలు ఉన్నవారు రోటీలను తక్కువ మోతాదులోనే తీసుకోవాలి.
థైరాయిడ్ ఉన్నవారు గోధుమలు తీసుకోకపోవడమే మంచిది. గోధుమల్లోని గ్లూటెన్ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. దీంతో థైరాయిడ్ సమస్య కూడా పెరుగుతుంది. కాబట్టి, జాగ్రత్త. అదే విధంగా, మనం నీరసంగా అలసిపోయి ఉన్నప్పుడు వీటిని తినడం వల్ల మరింత నీరసం అనిపిస్తుంది. రోటీల్లోని కార్బోహైడ్రేట్స్ అలసటని పెంచుతాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే సమస్య మరింత పెరుగుతుంది. కొంతమందికి వీటిని తిన్నా ఆకలి తీరదు.
షుగర్ ఉన్నవారు రోటీలు తింటారు. అయితే, వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బీపి పెరుగుతుంది. దీంతో షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయి. దీంతోపాటు, కొంతమందికి బాడీ సహజంగానే వేడిగా ఉంటుంది. అయితే, అలాంటివారు రోటీలు తింటే బాడీలో మరింత ఎక్కువగా వేడి ఉత్పత్తి అవుతుంది. నీటి శాతం తగ్గుతుంది. దీంతో మరిన్ని సమస్యలు పెరుగుతాయి.
చపాతీలు మంచివే అయినప్పటికీ, ఎక్కువగా తినడం వల్ల పైన చెప్పుకున్న సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, వీటిని మోతాదులో తీసుకోవాలి. ముఖ్యంగా, రోజుకి రెండు చపాతీలు అందులో ఎక్కువగా ఫైబర్ ఉండే కూరగాయలు ఉండేలా చూసుకోండి. పైగా అలర్జీలు ఉన్నవారు ఆ చపాతీలు తినడం కూడా తగ్గిస్తే లేదా మానేస్తే మంచిది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!







