ఒమన్ లో దీపావళి.. రంగురంగుల లైట్లతో వెలుగొందిన భారత ప్రవాసుల నివాసాలు..!!
- November 03, 2024
మస్కట్: దీపావళిని పురస్కరించుకుని ఒమన్ లోని ప్రవాస భారతీయులు తమ నివాసాలను రంగురంగుల లైట్లు, పువ్వులతో అలకరించుకొని ప్రధాన ఆకర్షణగా నిలిచారు. దీపాల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ముఖ్యంగా రూవీలో నివాసితులు ఒకరినొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, రుచికరమైన వంటకాలను షేర్ చేసుకోవడంతో పండుగను ఆత్మీయంగా జరుపుకున్నారు. ఒమన్లోని ఆభరణాలు, స్వీట్ షాప్లు భారతీయులతో సందడి నెలకొన్నది. "ఈ సంవత్సరం, మేము దీపావళిని జరుపుకోవడానికి కొంతమంది స్థానిక స్నేహితులతో కలిసి వచ్చాము" అని వికీ అనే ప్రవాస భారతీయుడు తెలిపారు. మరో ప్రవాసుడు సూర్య కుమార్ మాట్లాడుతూ.. “మేము ఈ వేడుకను మా కుటుంబ స్నేహితులతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. దీపావళి పార్టీని ఏర్పాటు చేసాము. మేము కూడా సమీపంలోని ఆలయానికి వెళ్లి అక్కడ పూజలు చేసాము.’’ అని చెప్పారు. మస్కట్లో ఒంటరిగా నివసించే దక్షిణ భారత ప్రవాసుడు మోహన్లాల్ మాట్లాడుతూ.. " ఈ సమయంలో మా కుటుంబాన్ని మేము నిజంగా మిస్ అవుతున్నాము." అని ఎమోషనల్ అయ్యారు. ఖురమ్ నివాసి అవినాష్ మాట్లాడుతూ.. “దీపావళి అంటే మేము సన్నిహితులు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం. నేను వంట చేయడం ఆనందించాను . దీపావళి నేపథ్యంతో గజర్ కా హల్వా, మసాలా కాజు, ఘుద్ కి మిథాయ్, ఫ్రెష్ మావా (బర్ఫీ కోసం), ఇంటికి నాన్ ఖతై వంటి వంటకాలను సిద్ధం చేసాను.’’ అని తెలిపారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







