ఒమన్ లో దీపావళి.. రంగురంగుల లైట్లతో వెలుగొందిన భారత ప్రవాసుల నివాసాలు..!!
- November 03, 2024
మస్కట్: దీపావళిని పురస్కరించుకుని ఒమన్ లోని ప్రవాస భారతీయులు తమ నివాసాలను రంగురంగుల లైట్లు, పువ్వులతో అలకరించుకొని ప్రధాన ఆకర్షణగా నిలిచారు. దీపాల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ముఖ్యంగా రూవీలో నివాసితులు ఒకరినొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, రుచికరమైన వంటకాలను షేర్ చేసుకోవడంతో పండుగను ఆత్మీయంగా జరుపుకున్నారు. ఒమన్లోని ఆభరణాలు, స్వీట్ షాప్లు భారతీయులతో సందడి నెలకొన్నది. "ఈ సంవత్సరం, మేము దీపావళిని జరుపుకోవడానికి కొంతమంది స్థానిక స్నేహితులతో కలిసి వచ్చాము" అని వికీ అనే ప్రవాస భారతీయుడు తెలిపారు. మరో ప్రవాసుడు సూర్య కుమార్ మాట్లాడుతూ.. “మేము ఈ వేడుకను మా కుటుంబ స్నేహితులతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. దీపావళి పార్టీని ఏర్పాటు చేసాము. మేము కూడా సమీపంలోని ఆలయానికి వెళ్లి అక్కడ పూజలు చేసాము.’’ అని చెప్పారు. మస్కట్లో ఒంటరిగా నివసించే దక్షిణ భారత ప్రవాసుడు మోహన్లాల్ మాట్లాడుతూ.. " ఈ సమయంలో మా కుటుంబాన్ని మేము నిజంగా మిస్ అవుతున్నాము." అని ఎమోషనల్ అయ్యారు. ఖురమ్ నివాసి అవినాష్ మాట్లాడుతూ.. “దీపావళి అంటే మేము సన్నిహితులు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం. నేను వంట చేయడం ఆనందించాను . దీపావళి నేపథ్యంతో గజర్ కా హల్వా, మసాలా కాజు, ఘుద్ కి మిథాయ్, ఫ్రెష్ మావా (బర్ఫీ కోసం), ఇంటికి నాన్ ఖతై వంటి వంటకాలను సిద్ధం చేసాను.’’ అని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









