ఆగ్రోటూరిజం స్కీమ్.. యూఏఈ వ్యవసాయ క్షేత్రాల్లో సందర్శకుల సందడి..!!
- November 05, 2024
యూఏఈ: యూఏఈ వ్యవసాయ క్షేత్రాల్లో సందర్శకులు సందడి చేయనున్నారు. గత నెలలో ప్రారంభించిన ప్లాంట్ ది ఎమిరేట్స్ కార్యక్రమంలో భాగంగా ఆగ్రోటూరిజం స్కీమ్ ను ప్రవేశపెట్టారు. మల్టీ వ్యవసాయ క్షేత్రాలతో పర్యావరణ మంత్రిత్వ శాఖ (MoCCAE) భాగస్వామిగా ఉంటుందని MoCCAE అండర్ సెక్రటరీ మహమ్మద్ సయీద్ సుల్తాన్ అల్ నుయిమి తెలిపారు. “యూఏఈ తన ఆహార సరఫరాను ఎలా పెంచుతోందో ప్రజలకు.. విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. యూఏఈలో కొన్ని అద్భుతమైన స్థానిక వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించడం, ఉత్పత్తి చేయడం వంటి వాటిపై సందర్శకులకు రైతులు అవగాహన కల్పిస్తారు. ఇది రైతులకు కూడా మేలు చేస్తుంది." అని వివరించారు. అగ్రోటూరిజం డ్రైవ్ ప్రతి ఎమిరేట్కు చేరుకుంటుందని, స్థానిక రైతులతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుందని, రాబోయే సీజన్ వరల్డ్స్ కూలెస్ట్ వింటర్ క్యాంపెయిన్పై ప్రత్యేక దృష్టి సారిస్తామని అల్ నుయిమి చెప్పారు. ఎడారిలో మొక్కలను పెంచడంలో సవాళ్లు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా వ్యవసాయ క్షేత్రాల్లో ప్రత్యేకమైన ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించి, దేశంలోని రైతులు స్ట్రాబెర్రీ నుండి గోధుమలు మరియు కుంకుమపువ్వు వరకు ప్రతిదీ పండిస్తున్నారని, ఇది సందర్శకులకు వ్యవసాయంపై ప్రత్యేక ఆసక్తిని పెంచుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









