కువైట్ ఇండియన్ ఎంబసీలో ఆకట్టుకున్న 'దక్షిణ సంభ్రమ'..!!
- November 09, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని నవంబర్ 8వ తేదీన "దక్షిణ సంభ్రమ"ను నిర్వహించింది. ఎంబసీ ఆడిటోరియంలో ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వివిధ కమ్యూనిటీ సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంబాసిడర్ డాక్టర్ ఆదర్శ్ స్వైకా తన ప్రారంభ ప్రసంగంలో.. కమ్యూనిటీ మద్దతు కోసం ఎంబసీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అవసరమైన వారికి సహాయం చేయడానికి ఎంబసీ 12 వాట్సాప్ నంబర్లు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. ఇటీవల ఎంబసీ సిబ్బందిగా నటిస్తూ.. సహాయం కోసం డబ్బు అడుగుతున్నారని , ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అనంతరం కన్నడ కూట, తుళు కూట, బిల్లవ సంఘం, తెలుగు కళా సమితి, ప్రవాసాంధ్ర తదితర సంఘాల సభ్యులచే మంత్రముగ్ధులను చేసే శాస్త్రీయ, జానపద నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు.ముఖ్యంగా తులనాడు పులి నృత్యం, యక్షగాన, కూచిపూడి, చక్కా భజనలు వంటి సాంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేకంగా నిలిచాయ. ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక సాంస్కృతిక వారసత్వాన్ని తెలిపే ప్రదర్శనలు సందర్శకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









