సౌదీ అరేబియాలో 1.54 మిలియన్లు దాటిన వాణిజ్య రిజిస్ట్రేషన్ల సంఖ్య..!!
- November 14, 2024
రియాద్: 2023 సంవత్సరంలో వస్తువులు, సేవల పరంగా సౌదీ వాణిజ్య మార్పిడి వృద్ధి SR2.5 ట్రిలియన్లకు మించిందని సౌదీ వాణిజ్య మంత్రి డా. మజేద్ అల్-కసాబీ తెలిపారు. అక్టోబరు 2024 ముగింపునాటికి రాజ్యంలో వాణిజ్య రిజిస్ట్రేషన్ల సంఖ్య 1.54 మిలియన్లను దాటిందన్నారు. హాయిల్ లోని వ్యాపారవేత్తలు, మహిళలతో పాటు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. వారి వివిధ రంగాలను అభివృద్ధి చేసేందుకు వారు ఎదుర్కొంటున్న ప్రతిపాదనలు, సవాళ్లపై ఆయన సమీక్షించారు.హైల్ పర్యటన సందర్భంగా కసాబీ హైల్లోని ఎమిర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సాద్తో సమావేశమయ్యారు.
2022లో రాజ్యంలో జరిగే మొత్తం వాణిజ్యంలో ఇ-కామర్స్ వృద్ధి 8 శాతంగా ఉందని, 2025 నాటికి దాని ఆదాయాలు SR260 బిలియన్లకు చేరుకుంటాయని అల్-కసాబీ చెప్పారు. గత ఎనిమిదేళ్లలో 110 కంటే ఎక్కువ చట్టాలతో వాణిజ్య చట్టంలో సమీక్షలు ఉన్నాయని, ముఖ్యంగా కొత్త కంపెనీల చట్టం, ఈ-కామర్స్ చట్టం, కమర్షియల్ ఫ్రాంచైజ్ చట్టం, దాని కార్యనిర్వాహక నిబంధనలు ఉన్నాయని మంత్రి చెప్పారు. వినియోగదారుల రక్షణ చట్టం చివరి దశలో ఉందని, వినియోగదారుల ఫిర్యాదుల కేంద్రం రీకాల్ సెంటర్, వినియోగదారుల రక్షణ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. హైల్ ప్రాంతంలోని తనిఖీ బృందాలు ప్రస్తుత సంవత్సరంలో 34500 కంటే ఎక్కువ తనిఖీలను నిర్వహించాయని , 19700 కంటే ఎక్కువ వాణిజ్య ఫిర్యాదులను ప్రాసెస్ చేశాయని ఆయన వివరించారు. గత ఐదేళ్లలో హాయిల్ ప్రాంతంలో వాణిజ్య రిజిస్ట్రేషన్లు 27.9 శాతం వృద్ధిని నమోదు చేశాయని, 33000 కంటే ఎక్కువ వాణిజ్య రిజిస్ట్రేషన్లకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







