ప్రధాని నరేంద్ర మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం..!
- November 18, 2024
ప్రధాని నరేంద్ర మోదీకి నైజీరియా ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. నైజీరియా మోదీని గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ (GCON) అవార్డుతో సత్కరించనుంది. 1969లో క్వీన్ ఎలిజబెత్కు కూడా నైజీరియా ఇదే అవార్డును ప్రదానం చేసింది.
ఆ తర్వాత ఈ అవార్డును అందుకోనున్న విదేశీ ప్రముఖుడిగా మోదీకి ప్రత్యేక స్థానం దక్కింది. విదేశాల్లో ప్రధాని మోదీ అంతర్జాతీయ అవార్డులను అందుకోగా.. అందులో ఇది 17వ పురస్కారం. నైజీరియాలోని అబుజా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజెన్వో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపికను అందజేశారు.
నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నైజీరియా చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ చర్చించనున్నారు. జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ వెళ్లనున్నారు. ఆ తర్వాత వివిధ సభ్యదేశాధినేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.
ఈ నెల 18, 19 తేదీల్లో రియో డీ జనీరోలో జరగబోయే శిఖరాగ్ర సమావేశానికి కూడా మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరుకానున్నారు. గయానా దేశాధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఈ నెల 19న మోదీ గయానాకు చేరుకోనున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు మోదీ అక్కడే ఉండనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







