గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా పంపిణీ షురూ
- November 20, 2024
• రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎక్స్ గ్రేషియా
• తొలి విడతగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం
• గల్ఫ్ దేశాలలో చనిపోయిన ప్రవాసి కార్మికులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
• గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడలో గల్ఫ్ ఎక్స్ గ్రేషియా పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 17 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు అందజేయనున్నారు. ఈ పథకం దేశ చరిత్రలోనే ప్రథమం, గల్ఫ్ దేశాలలో చనిపోయిన ప్రవాసి కార్మికులకు ఒక రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల మృతధన సహాయం చేయడం ఇదే మొదటిసారి.
గల్ఫ్ కార్మికులు ఆయురారోగ్యాలతో క్షేమంగా, సురక్షితంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ఆకాంక్షించారు. కాని, దురదృష్టవశాత్తు కానరాని దేశంలో కన్ను మూసిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఆదుకోవడానికి రూ.5 లక్షల మృతధన సహాయం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.85 లక్షలు కేటాయించారు. ఈ సొమ్ము వారి బ్యాంకు ఖాతాలలోకి నేరుగా బదిలీ అవుతుంది.
2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ‘అభయ హస్తం’ మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో సెప్టెంబర్ 16న జీవో నెంబర్ 205 జారీచేసింది. ఈ పథకం అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి తదితర నాయకులు కృషి చేశారు.
గతంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పదేళ్ల పరిపాలనా కాలంలో గల్ఫ్ దేశాలలో తెలంగాణ కార్మికులు సుమారు రెండు వేల మంది చనిపోయారు. పలు సందర్భాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ప్రస్తావించారు. కానీ, ఇప్పటివరకు ఆ హామీ నెరవేర్చలేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గల్ఫ్ మృతుల వివరాలు:
• గంగిపెల్లి తిరుపతి, దుబాయి, యూఏఈ (బూరుగుపల్లి, బోయిన్ పల్లి)
• దాసరి బాబు, ఓమాన్ (బోయిన్ పల్లి)
• కైర నాగయ్య, సౌదీ అరేబియా (చందుర్తి)
• పోతుగంటి భూమయ్య, సౌదీ అరేబియా (చందుర్తి)
• బైరి వెంకటేశం, ఇరాక్ (ఓబులాపూర్, ఇల్లంతకుంట)
• ఏనుగుల భాస్కర్, దుబాయి, యూఏఈ (ఓబులాపూర్, ఇల్లంతకుంట)
• బోయిని గణేష్, దుబాయి, యూఏఈ (వంతడుపుల, ఇల్లంతకుంట)
• కారవాని దేవయ్య, దుబాయి, యూఏఈ (గంభీరావుపేట)
• ఇకృతి యెల్లం గౌడ్, దుబాయి, యూఏఈ (నిమ్మపెల్లి, కొనరావుపేట)
• పిట్ల మహేష్, సౌదీ అరేబియా (వెంకటయ్య కుంట, ముస్తాబాద్)
• గెరిగంటి అంజయ్య, దుబాయి, యూఏఈ (మల్లారెడ్డిపేట, ముస్తాబాద్)
• సిలివేరి నాంపెల్లి, ఓమాన్ (రామన్నపల్లి, తంగళ్లపల్లి)
• దురిశెట్టి కొండయ్య, దుబాయి, యూఏఈ (బాలానగర్, వేములవాడ)
• పెండ్యాల చంద్రకాంత్, దుబాయి, యూఏఈ (నూకలమర్రి, వేములవాడ రూరల్)
• మాదాసు విజయ్, ఓమాన్ (ఆచన్నపల్లి, వేములవాడ రూరల్)
• పల్లి అంజయ్య, బహరేన్ (అక్కపల్లి, ఎల్లారెడ్డిపేట)
• నిమ్మల రాజు, బహరేన్ (రాచర్ల బొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట)
ఈ పథకం ద్వారా గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవితాల్లో కొంత మీరు వెలుగులు నింపవచ్చు.
--వేణు_పెరుమాళ్ల (మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!
- బహ్రెయిన్ దక్షిణ గవర్నరేట్ కు WHO 'హెల్తీ గవర్నరేట్' హోదా..!!
- కువైట్లో నేడు క్లాసెస్ రద్దు..!!
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!







