దోహా వేదికగా వైభవంగా ప్రారంభమైన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
- November 22, 2024
దోహా: దోహా వేదికగా జరుగుతున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు భాషాభిమానులు , సాహితీ వేత్తలు , కవులు , రచయితలు , వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సదస్సును ప్రారంభించారు. తెలుగు గడ్డకు దూరంగా నివసిస్తున్నా, భాషాభిమానంతో వంగూరి ఫౌండేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించటం అభినందనీయమని వెంకయ్య నాయుడు కొనియాడారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సాహితీ సౌరభాలు వెదజల్లేలా దోహా వేదికగా 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు. ఖతార్ దేశం లో భారత రాయబారి విపుల్ కు పలు హిందీ, తెలుగు గ్రంధాలను యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ బహూకరించారు. వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు అనారోగ్యం వలన వీడియో సందేశం పంపారు. దర్శక నిర్మాత వై వి యస్ చౌదరి, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు భాగవతుల వెంకప్ప తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుండగా పలువురు ప్రముఖులు ప్రసంగాలు చేయనున్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రత్నిది, ఖతార్)

తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









