మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా
- November 26, 2024
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు.ఇవాళ ఉదయం రాజ్భవన్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. షిండే వెంట డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని షిండేను గవర్నర్ కోరారు.
కాగా, మహారాష్ట్ర రాజకీయ అత్యున్నత స్థానం కోసం బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధినేత ఏక్నాథ్ షిండే పోటీపడుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 132 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినందున, ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ వాదనకు బలం చేకూరింది. శివసేన 57 సీట్లు మాత్రమే గెలుచుకున్నప్పటికీ, బీహార్లో ఎన్డిఎ రాజకీయ ఏర్పాటును ఉటంకిస్తూ అగ్ర పదవిని డిమాండ్ చేస్తోంది. సంకీర్ణంలో బీజేపీకి ‘పెద్దన్న’ హోదా ఉన్నప్పటికీ నితీష్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి.
ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ.. బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఇక ప్రస్తుత అసెంబ్లీ గడువు నేటితో ముగియనుంది. ఇంతవరకూ సీఎం అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు ముఖ్యమంత్రి పదవిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









