ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు
- December 09, 2024
-ఆర్కేపురంలోని రెండు స్కూళ్లకు బాంబు బెదిరింపు
-ఈ-మెయిల్ ద్వారా స్కూళ్లకు బాంబు బెదిరింపు
-స్కూళ్లలో కొనసాగుతున్న బాంబు స్క్వాడ్ తనిఖీలు
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. సోమవారం ఉదయం ఢిల్లీలోని రెండు పాఠశాలల్లో బాంబులు ఉన్నట్లు బెదిరింపులు వచ్చాయి. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS), పశ్చిమ్ విహార్లోని జీడీ గోయెంకా స్కూళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు పంపారు.
ఈ బెదిరింపుల నేపథ్యంలో పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తమై, విద్యార్థులను ఇండ్లకు పంపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్క్వాడ్తోపాటు అగ్నిమాపక సిబ్బంది రెండు స్కూళ్లలో తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని పోలీసులు తెలిపారు.
ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఢిల్లీలోని పలు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది మే నెలలో కనీసం 60 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అయితే, దర్యాప్తులో బాంబులు లేదా పిల్లల భద్రతకు ఎటువంటి ముప్పు లేదని తేలింది.
ఈ సంఘటనల నేపథ్యంలో పాఠశాలలు, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. విద్యార్థుల భద్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఈ విధమైన బెదిరింపులు విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. భద్రతా చర్యలు మరింత కఠినంగా అమలు చేయడం అవసరం అని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







