టూరిస్ట్ వీసా డివైజ్.. రికార్డు సమయంలో వీసాల జారీ..!!
- December 10, 2024
రియాద్: నిబంధనలకు అనుగుణంగా పర్యాటకులు తమ వీసాలను రికార్డు సమయంలో పొందేందుకు వీలుగా డైరెక్టరేట్ టూరిస్ట్ వీసా డివైజ్ ను ప్రారంభించిందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ ప్రతినిధి మేజర్ నాసర్ అల్-ఒటైబి తెలిపారు. అన్ని అంతర్జాతీయ నౌకాశ్రయాలలో అందుబాటులో ఉన్న పర్యాటక వీసా డివైజ నుండి పర్యాటకులు ప్రయోజనం పొందవచ్చని తెలిపారు.పాస్పోర్ట్ను స్కాన్ చేయడం, ఆపై పర్యాటకుల ఫోటో, వేలిముద్ర తీసుకోవడం, ఆరోగ్య బీమాను పరిశీలించడంతోపాటు చెల్లింపు కోసం వివిధ రకాల కార్డులను అనుమతించడం వంటి ఐదు దశల ద్వారా వీసా జారీ అవుతుందన్నారు. ఇది వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2019లో ప్రారంభించబడిన ఈ డివైజ్ ద్వారా ప్రపంచంలోని 49 దేశాల పౌరులు లబ్ది పొందేందుకు వీలు కల్పించినట్టు తెలిపారు. ఇది రాజ్యంలో పర్యాటక రంగాన్ని మెరుగుపరచడానికి, విజన్ 2030 యొక్క లక్ష్యాలను సాకారం చేయడంలో సహాయపడుతుందన్నారు.
తాజా వార్తలు
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!









