టూరిస్ట్ వీసా డివైజ్.. రికార్డు సమయంలో వీసాల జారీ..!!
- December 10, 2024
రియాద్: నిబంధనలకు అనుగుణంగా పర్యాటకులు తమ వీసాలను రికార్డు సమయంలో పొందేందుకు వీలుగా డైరెక్టరేట్ టూరిస్ట్ వీసా డివైజ్ ను ప్రారంభించిందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ ప్రతినిధి మేజర్ నాసర్ అల్-ఒటైబి తెలిపారు. అన్ని అంతర్జాతీయ నౌకాశ్రయాలలో అందుబాటులో ఉన్న పర్యాటక వీసా డివైజ నుండి పర్యాటకులు ప్రయోజనం పొందవచ్చని తెలిపారు.పాస్పోర్ట్ను స్కాన్ చేయడం, ఆపై పర్యాటకుల ఫోటో, వేలిముద్ర తీసుకోవడం, ఆరోగ్య బీమాను పరిశీలించడంతోపాటు చెల్లింపు కోసం వివిధ రకాల కార్డులను అనుమతించడం వంటి ఐదు దశల ద్వారా వీసా జారీ అవుతుందన్నారు. ఇది వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2019లో ప్రారంభించబడిన ఈ డివైజ్ ద్వారా ప్రపంచంలోని 49 దేశాల పౌరులు లబ్ది పొందేందుకు వీలు కల్పించినట్టు తెలిపారు. ఇది రాజ్యంలో పర్యాటక రంగాన్ని మెరుగుపరచడానికి, విజన్ 2030 యొక్క లక్ష్యాలను సాకారం చేయడంలో సహాయపడుతుందన్నారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







