టూరిస్ట్ వీసా డివైజ్.. రికార్డు సమయంలో వీసాల జారీ..!!
- December 10, 2024
రియాద్: నిబంధనలకు అనుగుణంగా పర్యాటకులు తమ వీసాలను రికార్డు సమయంలో పొందేందుకు వీలుగా డైరెక్టరేట్ టూరిస్ట్ వీసా డివైజ్ ను ప్రారంభించిందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ ప్రతినిధి మేజర్ నాసర్ అల్-ఒటైబి తెలిపారు. అన్ని అంతర్జాతీయ నౌకాశ్రయాలలో అందుబాటులో ఉన్న పర్యాటక వీసా డివైజ నుండి పర్యాటకులు ప్రయోజనం పొందవచ్చని తెలిపారు.పాస్పోర్ట్ను స్కాన్ చేయడం, ఆపై పర్యాటకుల ఫోటో, వేలిముద్ర తీసుకోవడం, ఆరోగ్య బీమాను పరిశీలించడంతోపాటు చెల్లింపు కోసం వివిధ రకాల కార్డులను అనుమతించడం వంటి ఐదు దశల ద్వారా వీసా జారీ అవుతుందన్నారు. ఇది వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2019లో ప్రారంభించబడిన ఈ డివైజ్ ద్వారా ప్రపంచంలోని 49 దేశాల పౌరులు లబ్ది పొందేందుకు వీలు కల్పించినట్టు తెలిపారు. ఇది రాజ్యంలో పర్యాటక రంగాన్ని మెరుగుపరచడానికి, విజన్ 2030 యొక్క లక్ష్యాలను సాకారం చేయడంలో సహాయపడుతుందన్నారు.
తాజా వార్తలు
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం









