షార్జాలో ఖైదీల విడుదలపై కొత్త నిబంధనలు..!!
- December 11, 2024
యూఏఈ: షార్జాలో ఖైదీల విడుదలకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రకటించారు. ఎమిరేట్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. షార్జాలోని ఖైదీలను షరతులతో విడుదల మంజూరు చేయబడవచ్చు. ఖైదీ తన శిక్షలో మూడొంతుల కాలం తర్వాత పెరోల్పై విడుదల చేయవచ్చని పేర్కొంది. యావజ్జీవ కారాగార శిక్ష పడిన వారు కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి ఉంటే షరతులతో కూడిన విడుదలను మంజూరు చేయవచ్చు. అయితే, ఖైదీల విడుదలపై షార్జా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎమిరేట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తెలియజేసి, వారి నిర్ణయం ఆధారంగా ఖైదీలను విడుదల చేస్తారు.
తాజా వార్తలు
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!









