దోహా మెట్రోలో ‘సౌఖ్ అల్ రైల్’.. ఆకట్టుకుంటున్న ప్రత్యేక ఈవెంట్లు..!!
- December 11, 2024
దోహా: ఖతార్ రైల్వేస్ కంపెనీ (ఖతార్ రైల్) నిర్వహించిన “సౌక్ అల్ రైల్” ఈవెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది. డిసెంబర్ 14 వరకు జరిగే కార్యక్రమాలు దోహా మెట్రోలోని మషీరెబ్ స్టేషన్లో ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ఖతార్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఖతార్ రైల్ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఖతార్ రైల్లోని కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ అబ్దుల్లా అలీ అల్ మవ్లావి మాట్లాడుతూ.. “'సౌక్ అల్ రైల్' ఈవెంట్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.రోజువారీ కార్యకలాపాలతో విస్తృతంగా ప్రజల భాగస్వామ్యం, సానుకూల స్పందన పట్ల తాము సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. “ఖతార్ జాతీయ దినోత్సవ వేడుకలలో భాగమైన ఈ ఈవెంట్, ఈ జాతీయ సందర్భంగా కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని, సభ్యుల మధ్య ఉండే స్ఫూర్తిని పెంపొందించడానికి మా బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రత్యేకమైన సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను ఆస్వాదించడానికి 'సౌక్ అల్ రైల్' వద్ద మాతో చేరాలని మేము ప్రతి ఒక్కరినీ, నివాసితులు మరియు సందర్శకులను ఆహ్వానిస్తున్నాము.’’ అని పేర్కొన్నారు.
దోహా మెట్రో మూడు లైన్ల కూడలి అయిన మషీరెబ్ స్టేషన్ సాంస్కృతిక, వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందింది. "సౌక్ అల్ రైల్" రోజువారీ షెడ్యూల్ ఆదివారం నుండి గురువారం వరకు సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు, శుక్రవారం, శనివారం సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఖతారీ అర్ధ స్వోర్డ్ డ్యాన్స్, సాంప్రదాయ ఖతారీ డ్రెస్ కార్నర్, ఫేస్ పెయింటింగ్, ఫాల్కన్రీ, నేషనల్ డే క్విజ్, స్టోరీ టెల్లింగ్ సర్కిల్ వంటి ఇంటరాక్టివ్ కుటుంబ-స్నేహపూర్వక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







