దుబాయ్ లో 77 డెలివరీ మోటార్సైకిల్స్ సీజ్, ఫైన్..!!
- December 13, 2024
దుబాయ్: దుబాయ్ లో నిబంధనలు పాటించని డెలివరీ మోటార్సైకిళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందు కోసం నిరంతరం తనిఖీలను చేపడుతున్నట్టు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) వెల్లడించింది. తనిఖీల సందర్భంగా 1,200 కంటే ఎక్కువ జరిమానాలను జారీ చేసినట్టు తెలిపింది. ఇందులో అసురక్షిత డ్రైవింగ్, రక్షణ గేర్ ధరించకపోవడం, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలు లేకపోవడం వంటి ఉల్లంఘనలకు జరిమానాలు విధించినట్టు అథారిటీ పేర్కొంది.
హెస్సా స్ట్రీట్, జబీల్ స్ట్రీట్, జుమేరా స్ట్రీట్, డౌన్టౌన్, మిర్డిఫ్, మోటార్ సిటీ తదితర పట్టణ ప్రాంతాలలో తనిఖీలు జరిగాయన్నారు. ఈ సందర్భంగా బీమా, రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన 44 మోటార్సైకిళ్లను సీజ్ చేశారు. దాంతోపాటు అవసరమైన అనుమతులు లేని33 ఎలక్ట్రిక్ బైక్లను సీజ్ చేసినట్టు అథారిటీ లైసెన్సింగ్ కార్యకలాపాల పర్యవేక్షణ డైరెక్టర్ సయీద్ అల్ రామ్సీ తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి