దుబాయ్ లో 77 డెలివరీ మోటార్సైకిల్స్ సీజ్, ఫైన్..!!
- December 13, 2024
దుబాయ్: దుబాయ్ లో నిబంధనలు పాటించని డెలివరీ మోటార్సైకిళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందు కోసం నిరంతరం తనిఖీలను చేపడుతున్నట్టు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) వెల్లడించింది. తనిఖీల సందర్భంగా 1,200 కంటే ఎక్కువ జరిమానాలను జారీ చేసినట్టు తెలిపింది. ఇందులో అసురక్షిత డ్రైవింగ్, రక్షణ గేర్ ధరించకపోవడం, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలు లేకపోవడం వంటి ఉల్లంఘనలకు జరిమానాలు విధించినట్టు అథారిటీ పేర్కొంది.
హెస్సా స్ట్రీట్, జబీల్ స్ట్రీట్, జుమేరా స్ట్రీట్, డౌన్టౌన్, మిర్డిఫ్, మోటార్ సిటీ తదితర పట్టణ ప్రాంతాలలో తనిఖీలు జరిగాయన్నారు. ఈ సందర్భంగా బీమా, రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన 44 మోటార్సైకిళ్లను సీజ్ చేశారు. దాంతోపాటు అవసరమైన అనుమతులు లేని33 ఎలక్ట్రిక్ బైక్లను సీజ్ చేసినట్టు అథారిటీ లైసెన్సింగ్ కార్యకలాపాల పర్యవేక్షణ డైరెక్టర్ సయీద్ అల్ రామ్సీ తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







