ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- March 18, 2026
అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రాంతీయంగా నెలకొన్న పరిణామాలపై చర్చించారు. అంతర్జాతీయ భద్రత, స్థిరత్వం పై వాటి తీవ్ర ప్రభావాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
యూఏఈ మరియు జీసీసీ లోని ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దాడులను భారతదేశం ఖండిస్తుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అలాగే, తన భద్రత, సార్వభౌమత్వం మరియు ప్రజల క్షేమాన్ని కాపాడుకోవడానికి యూఏఈ తీసుకుంటున్న చర్యలకు భారతదేశం సంఘీభావం తెలుపుతుందని స్పష్టం చేశారు.
ప్రస్తుత సంక్షోభాలను నివారించి, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ శాంతి భద్రతలను పరిరక్షించే విధంగా ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడానికి చర్చలు మరియు దౌత్య మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్రిక్తతలను తక్షణమే నిలిపివేయాలని ఇరువురు నేతలు సంయుక్తంగా పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







