బలగం మూవీ సింగర్ మొగులయ్య అనారోగ్యంతో కన్నుమూత
- December 19, 2024
హైదరాబాద్: జానపద కళాకారుడు మొగులయ్య, బలగం మూవీలో తన గాత్రంతో ప్రేక్షకుల హృదయాలను కదిలించిన వ్యక్తి అనారోగ్యంతో కన్నుమూశారు. మొగులయ్య కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ, వరంగల్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. మొగులయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. కానీ, వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన మరణించారు. మొగులయ్య మరణం జానపద కళారంగానికి తీరని లోటు.
మొగులయ్య తన గాత్రంతో బలగం సినిమాలో క్లైమాక్స్ సాంగ్ను అద్భుతంగా ఆలపించి, ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు. ఈ పాటతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మొగులయ్య కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండటంతో, ఆయన సతీమణి కొమురమ్మ సాయం కోసం ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మొగులయ్య మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మొగులయ్య వంటి ప్రతిభావంతుల కళాకారులు మన సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబానికి మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాం.
--వేణు_పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్







