పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- December 24, 2024
న్యూ ఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. బీహార్, ఒడిశా, మిజోరం, కేరళ, మణిపూర్ రాష్ట్రాల గవర్నర్లు మారారు.
- ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
- ప్రస్తుత మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్గా నియమితులయ్యారు.
- మిజోరాం గవర్నర్గా జనరల్ వీకే సింగ్ నియమితులయ్యారు.
- కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ బీహార్ గవర్నర్గా నియమితులయ్యారు.
- మణిపూర్ గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా నియమితులయ్యారు.
- బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళకు బదిలీ అయ్యారు.
ఈ గవర్నర్ల నియామకాలు వారు సంబంధిత కార్యాలయాలకు బాధ్యతలు స్వీకరించిన తేదీల నుండి అమలులోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









