భారతీయుడి మిస్సింగ్ కేసు విషాందాంతం.. మృత దేహం భారత్‌కు తరలింపు..!!

- December 25, 2024 , by Maagulf
భారతీయుడి మిస్సింగ్ కేసు విషాందాంతం.. మృత దేహం భారత్‌కు తరలింపు..!!

కువైట్: భారతీయుడి మిస్సింగ్ కేసు విషాందాంతమైంది. తప్పిపోయిన తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన భారతీయ జాతీయుడు కుమరేశన్ పెరుమాళ్ డిసెంబరు 16వ తేదీన అబు హలీఫా ప్రాంతంలో జరిగిన ట్రాఫిక్ ప్రమాదంలో మృతి చెందాడని అధికారులు తెలిపారు.  

తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త తెలిపిన వివరాల ప్రకారం.. కుమరేసన్ కువైట్‌లోని అల్-ధౌ జనరల్ ట్రేడింగ్ & కాంట్రాక్ట్ కంపెనీలో సేఫ్టీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. కుమరేసన్ తప్పిపోవడంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. సాయం అందించాలని సామాజిక కార్యకర్త శ్రీను సంప్రదించారు. అతను 16 డిసెంబర్ 2024 నుండి కంపెనీ వసతి గృహం నుండి తప్పిపోయినట్లు గుర్తించారు. కువైట్‌లోని ఆసుపత్రులను సంప్రదించిన తరువాత, వారు అబు హలీఫాలో వాహన ప్రమాదంలో కుమరేసన్ పెరుమాళ్ మరణించినట్లు ధృవీకరించారు. 24 గంటల్లో అన్ని లాంఛనాలను పూర్తి చేసి, మృత దేహాన్ని కువైట్ ఎయిర్‌వేస్ ద్వారా డిసెంబర్ 24న త్రివేండ్రంకు తరలించారు. కుమరేశన్ గత సంవత్సరం మాత్రమే పని కోసం కువైట్‌కు వచ్చాడని, అతనికి భార్య రంజని, ఏడాదిన్నర బాలుడు ప్రాణేష్ తంగా ఉన్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com