భారతీయుడి మిస్సింగ్ కేసు విషాందాంతం.. మృత దేహం భారత్కు తరలింపు..!!
- December 25, 2024
కువైట్: భారతీయుడి మిస్సింగ్ కేసు విషాందాంతమైంది. తప్పిపోయిన తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన భారతీయ జాతీయుడు కుమరేశన్ పెరుమాళ్ డిసెంబరు 16వ తేదీన అబు హలీఫా ప్రాంతంలో జరిగిన ట్రాఫిక్ ప్రమాదంలో మృతి చెందాడని అధికారులు తెలిపారు.
తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త తెలిపిన వివరాల ప్రకారం.. కుమరేసన్ కువైట్లోని అల్-ధౌ జనరల్ ట్రేడింగ్ & కాంట్రాక్ట్ కంపెనీలో సేఫ్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. కుమరేసన్ తప్పిపోవడంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. సాయం అందించాలని సామాజిక కార్యకర్త శ్రీను సంప్రదించారు. అతను 16 డిసెంబర్ 2024 నుండి కంపెనీ వసతి గృహం నుండి తప్పిపోయినట్లు గుర్తించారు. కువైట్లోని ఆసుపత్రులను సంప్రదించిన తరువాత, వారు అబు హలీఫాలో వాహన ప్రమాదంలో కుమరేసన్ పెరుమాళ్ మరణించినట్లు ధృవీకరించారు. 24 గంటల్లో అన్ని లాంఛనాలను పూర్తి చేసి, మృత దేహాన్ని కువైట్ ఎయిర్వేస్ ద్వారా డిసెంబర్ 24న త్రివేండ్రంకు తరలించారు. కుమరేశన్ గత సంవత్సరం మాత్రమే పని కోసం కువైట్కు వచ్చాడని, అతనికి భార్య రంజని, ఏడాదిన్నర బాలుడు ప్రాణేష్ తంగా ఉన్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







