భారతీయుడి మిస్సింగ్ కేసు విషాందాంతం.. మృత దేహం భారత్కు తరలింపు..!!
- December 25, 2024
కువైట్: భారతీయుడి మిస్సింగ్ కేసు విషాందాంతమైంది. తప్పిపోయిన తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన భారతీయ జాతీయుడు కుమరేశన్ పెరుమాళ్ డిసెంబరు 16వ తేదీన అబు హలీఫా ప్రాంతంలో జరిగిన ట్రాఫిక్ ప్రమాదంలో మృతి చెందాడని అధికారులు తెలిపారు.
తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త తెలిపిన వివరాల ప్రకారం.. కుమరేసన్ కువైట్లోని అల్-ధౌ జనరల్ ట్రేడింగ్ & కాంట్రాక్ట్ కంపెనీలో సేఫ్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. కుమరేసన్ తప్పిపోవడంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. సాయం అందించాలని సామాజిక కార్యకర్త శ్రీను సంప్రదించారు. అతను 16 డిసెంబర్ 2024 నుండి కంపెనీ వసతి గృహం నుండి తప్పిపోయినట్లు గుర్తించారు. కువైట్లోని ఆసుపత్రులను సంప్రదించిన తరువాత, వారు అబు హలీఫాలో వాహన ప్రమాదంలో కుమరేసన్ పెరుమాళ్ మరణించినట్లు ధృవీకరించారు. 24 గంటల్లో అన్ని లాంఛనాలను పూర్తి చేసి, మృత దేహాన్ని కువైట్ ఎయిర్వేస్ ద్వారా డిసెంబర్ 24న త్రివేండ్రంకు తరలించారు. కుమరేశన్ గత సంవత్సరం మాత్రమే పని కోసం కువైట్కు వచ్చాడని, అతనికి భార్య రంజని, ఏడాదిన్నర బాలుడు ప్రాణేష్ తంగా ఉన్నాడు.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









