డిసెంబర్ 28న యూఏఈ లాటరీ డ్రా.. మొదటి 11మందికి Dh100,000..!!
- December 27, 2024
యూఏఈ: మొదటి యూఏఈ లాటరీ డ్రాలో తొలి 11 మంది విజేతలు ఒక్కొక్కరికి Dh100,000 ప్రకటించిన తర్వాత ఉత్కంఠ పెరిగిందని ఆపరేటర్ చెప్పారు. డిసెంబర్ 14న జరిగిన మొదటి డ్రాలో అసాధారణమైన డిమాండ్ వచ్చిందని, ఇప్పటికే 29,000 మందికి పైగా విజేతలను గుర్తించినట్లు తెలిపారు. డిసెంబర్ 28న రెండవ డ్రా జరుగనుందని పేర్కొన్నారు. .
మొదటి డ్రాలో, మొదటి రెండు బహుమతులు Dh100 మిలియన్, Dh1 మిలియన్లు క్లెయిమ్ కాలేదన్నారు. బహుమతులు ఆటోమెటిక్ గా పాల్గొనేవారి ఖాతాలలో జమవుతుందన్నారు. "డ్రా తర్వాత, మా ప్రైజ్ క్లెయిమ్ కమిటీ గెలిచిన పార్టిసిపెంట్లను సంప్రదిస్తుంది. ప్రత్యేకమైన 'విజేత వేడుక'కి హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తుంది. మేము విజేతలను మా సోషల్ మీడియా ఛానెల్లలో ప్రకటిస్తాము. చెల్లింపు ప్రక్రియను సులభతరం చేస్తాము. మా విజేతల లభ్యతను బట్టి , ఈ మొత్తం ప్రక్రియ కొన్ని రోజుల నుండి కొన్ని వారాల వరకు ఉంటుంది" అని ఆపరేటర్ చెప్పారు.
లాటరీ Dh100 మిలియన్ల జాక్పాట్ను అందిస్తుందని, రెండవ బహుమతి 1 మిలియన్ లతోపాటు Dh100 మరియు Dh100,000 మధ్య ఇతర మొత్తాలను విజేతలకు అందజేస్తామని తెలిపారు. వీటితోపాటు ఏడు 'లక్కీ ఛాన్స్ IDలు' ఒక్కొక్కటి Dh100,000 గెలుచుకోవడం గ్యారెంటీ అని వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!
- సలాలాలో కాల్పుల కలకలం..ఇద్దరికి గాయాలు..!!
- కీలక ఓవర్నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!









