అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- March 04, 2026
దోహా: అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు మరియు గార్డియన్స్ తమ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరియు ప్రశాంతంగా ఉండాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) సూచించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటనను షేర్ చేసింది.
అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రుల ప్రవర్తన వారి పిల్లల భద్రత మరియు భరోసాను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పిల్లలను రక్షించడానికి తల్లిదండ్రులు అధికారుల మార్గదర్శకాలను పాటించాలని కోరింది. ఇంటిలో సురక్షితమైన స్థలాలను ఎంచుకొని క్షేమంగా ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
ఇంతకుముందు, ప్రమాద స్థలాల వద్ద గుమిగూడ వద్దని, క్షేత్రస్థాయిలో ఏదైనా సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తీయవద్దని లేదా వాటిని షేర్ చేయవద్దని మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తూ.. ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







