అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- March 04, 2026
దోహా: అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు మరియు గార్డియన్స్ తమ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరియు ప్రశాంతంగా ఉండాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) సూచించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటనను షేర్ చేసింది.
అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రుల ప్రవర్తన వారి పిల్లల భద్రత మరియు భరోసాను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పిల్లలను రక్షించడానికి తల్లిదండ్రులు అధికారుల మార్గదర్శకాలను పాటించాలని కోరింది. ఇంటిలో సురక్షితమైన స్థలాలను ఎంచుకొని క్షేమంగా ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
ఇంతకుముందు, ప్రమాద స్థలాల వద్ద గుమిగూడ వద్దని, క్షేత్రస్థాయిలో ఏదైనా సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తీయవద్దని లేదా వాటిని షేర్ చేయవద్దని మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తూ.. ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!









