రస్ అల్ ఖైమాలో కూలిన విమానం..భారతీయుడు సహా ఇద్దరు మృతి..!!
- December 30, 2024
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా విమాన ప్రమాదంలో 26 ఏళ్ల డాక్టర్తో పాటు ఇద్దరు మృతి చెందారు. గురువారం (డిసెంబర్ 26) రస్ అల్ ఖైమా తీరంలో జాజిరా ఏవియేషన్ క్లబ్ నుండి రెండు సీట్ల గ్లైడర్ కుప్పకూలింది. జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జిసిఎఎ) ప్రమాదాన్ని ధృవీకరించింది. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతుందని పేర్కొంది. బాధిత కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది.
మరణించిన 26 ఏళ్ల భారతీయ వైద్యుడు సులేమాన్ అల్ మాజిద్.. యూఏఈలో పుట్టి పెరిగాడు. బీచ్కు సమీపంలో ఉన్న కోవ్ రొటానా హోటల్ సమీపంలో మధ్యాహ్నం 2 గంటలకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయిందని అతని తండ్రి మజిద్ ముకర్రం తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్ అనే 29 ఏళ్ల పాకిస్థాన్ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది.
డాక్టర్ సులేమాన్ రైడ్ కోసం గ్లైడర్ను అద్దెకు తీసుకున్నారు. అతని కుటుంబం, అతని తండ్రి, తల్లి, తమ్ముడితో సహా ఏవియేషన్ క్లబ్లో ఉన్నారు. సులేమాన్ తర్వాతర అతడి తమ్ముడు విమానంలో వెళ్లాల్సి ఉంది.
తాజా వార్తలు
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్







