రస్ అల్ ఖైమాలో కూలిన విమానం..భారతీయుడు సహా ఇద్దరు మృతి..!!
- December 30, 2024
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా విమాన ప్రమాదంలో 26 ఏళ్ల డాక్టర్తో పాటు ఇద్దరు మృతి చెందారు. గురువారం (డిసెంబర్ 26) రస్ అల్ ఖైమా తీరంలో జాజిరా ఏవియేషన్ క్లబ్ నుండి రెండు సీట్ల గ్లైడర్ కుప్పకూలింది. జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జిసిఎఎ) ప్రమాదాన్ని ధృవీకరించింది. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతుందని పేర్కొంది. బాధిత కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది.
మరణించిన 26 ఏళ్ల భారతీయ వైద్యుడు సులేమాన్ అల్ మాజిద్.. యూఏఈలో పుట్టి పెరిగాడు. బీచ్కు సమీపంలో ఉన్న కోవ్ రొటానా హోటల్ సమీపంలో మధ్యాహ్నం 2 గంటలకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయిందని అతని తండ్రి మజిద్ ముకర్రం తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్ అనే 29 ఏళ్ల పాకిస్థాన్ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది.
డాక్టర్ సులేమాన్ రైడ్ కోసం గ్లైడర్ను అద్దెకు తీసుకున్నారు. అతని కుటుంబం, అతని తండ్రి, తల్లి, తమ్ముడితో సహా ఏవియేషన్ క్లబ్లో ఉన్నారు. సులేమాన్ తర్వాతర అతడి తమ్ముడు విమానంలో వెళ్లాల్సి ఉంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









