తెలంగాణలో శిశు ఆధార్ పథకం
- June 28, 2016
రాష్ట్రప్రభుత్వం తెలంగాణ శిశు ఆధార్ పేరుతో కొత్త పథకం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా పుట్టిన ప్రతీ బిడ్డకు 20 నిమిషాల్లోనే ఆధార్కార్డ్, జనన ధ్రువీకరణ పత్రాలు జారీచేయనున్నారు. జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చే అధికారాన్ని ఆస్పత్రి సూపిరింటెండెంట్కు ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని మొదట ప్రయోగాత్మకంగా వారం రోజుల్లో నయపూల్ ప్రసూతి ఆస్పత్రిలో అమలు చేయనుంది. జులై 15కల్లా పేట్ల బురుజు, కోఠి ప్రసూతి ఆస్పత్రి, నిలోఫర్, ఉస్మానియా ఆస్పత్రుల్లో అమలు చేయనుంది. జీహెచ్ఎంసీ, తెలంగాణ ఐటీ శాఖ ఆధార్ ప్రాంతీయ కార్యాలయం సంయుక్త నిర్వహణలో ప్రాజెక్టు అమలు కానుంది. ప్రభుత్వం తెలంగాణ శిశు ఆధార్ పథకాన్ని దశల వారీగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అమలు చేయాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







