నేడు సింగపూర్ వెళ్లనున్న కేటీఆర్
- June 28, 2016
మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ బుధవారం సింగపూర్ బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ జరిగే సౌతిండియన్ బిజినెస్ అచీవర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మలేసియాకు చేరుకుని గురువారం, జూలై ఒకటిన అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండు రోజుల పాటు జరిగే మలేసియా పర్యటనలో అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అవుతారు. తిరిగి జూలై రెండో తేదీన మంత్రి హైదరాబాద్కు తిరిగివస్తారు. కేటీఆర్ వెంట రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్ కూడా పర్యటనకు వెళుతున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







