తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదం

- January 04, 2025 , by Maagulf
తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదం

తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల అంశంపై మరోసారి వివాదం తలెత్తింది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు బనకచర్ల ప్రాజెక్టును ప్రకటించడం ఈ వివాదానికి మూలం.ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో నీటి సమస్యల్ని పరిష్కరించాలని చంద్రబాబు భావిస్తున్నారు.అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ లేదా గోదావరి బోర్డు అనుమతులు లేవని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు వల్ల గోదావరి నదిపై తెలంగాణకు నష్టం కలుగుతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. ప్రాజెక్టు అభివృద్ధిపై తమ అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే గోదావరి బోర్డు, కేంద్ర జలశక్తి శాఖలకి లేఖలు రాసి ఈ ప్రాజెక్టుపై పూర్తి వివరణ ఇవ్వాలని సూచించారు.

ఇక గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య చర్చలు అవసరం కనిపిస్తున్నాయి. నదీ జలాల పంపకాల కోసం 2014లోనే ఏర్పాటు చేసిన జల సంఘాలు ఇప్పటికీ సక్రమంగా పని చేయడంలేదన్న విమర్శలు వెలువడుతున్నాయి.రాష్ట్రాలు పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఈ వివాదం త్వరగా పరిష్కారమవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. గోదావరి జలాలు రెండు రాష్ట్రాలకూ కీలకమైనవే. అయితే, ఈ సమస్యను రాజకీయ కోణంలో కాకుండా పరస్పర సమన్వయంతో పరిష్కరించడం వల్ల నీటి వినియోగంలో సమర్థత సాధ్యమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com