31 ఏళ్ల తర్వాత తీర్పు..టేనెంట్ ను ఖాళీ చేయాలని ఆదేశాలు..!!
- January 05, 2025
మనామా: సదరన్ మునిసిపాలిటీ 31 ఏళ్ల లీజు ఒప్పందాన్ని హై అప్పీల్స్ కోర్టు సమర్థించింది. టేనెంట్ ను ఖాళీ చేయమని కోర్టు ఆదేశించింది. మున్సిపాలిటీ 1981లో లీజును రద్దు చేయాలని, టేనెంట్ ను తొలగించాలని కోరుతూ దావా వేసింది. 1981లో కుదిరిన లీజు, స్క్రాప్ మెటల్ ట్రేడింగ్ కోసం నియమించబడిన 215,168 చదరపు అడుగుల భూమిని కేటాయించారు. కౌలుదారు, లీజు నిబంధనలను ఉల్లంఘించి, మున్సిపాలిటీకి తెలియకుండా లేదా అనుమతి లేకుండా 50,000 దీనార్లకు భూమిని సబ్లెట్ ఇచ్చాడు. అద్దెదారు లీజును మరొక పార్టీకి బదిలీ చేయడాన్ని మున్సిపాలిటీ తప్పుబట్టింది. కోర్టును ఆశ్రయించింది. దిగువ కోర్టు మొదట మున్సిపాలిటీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. లీజు రద్దు చేసింది. కాగా, సబ్ లెట్ కు మున్సిపాలిటీ నుంచి అనుమతి ఇచ్చిందని టేనెంట్ కోర్టుకు తెలిపారు. అయితే అప్పీల్ను కోర్టు తిరస్కరించింది. ఒక కాంట్రాక్ట్ ఇరు పక్షాలపై కట్టుబడి ఉంటుందని, పరస్పర ఒప్పందం లేదా చట్టబద్ధంగా నిర్వచించబడిన కారణాల వల్ల తప్ప ఏకపక్షంగా మార్చడం లేదా రద్దు చేయడం సాధ్యం కాదని న్యాయమూర్తులు చెప్పారు. లీజులోసబ్లెట్ చేయడం నిషేధించబడిందని కోర్టు హైలైట్ చేసింది. ఆటో మెటిక్ గా లీజు రద్దు అవుతుందని, ప్లేస్ ను తక్షణమే ఖాళీ చేయాలని తన తీర్పులో పేర్కొంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







