31 ఏళ్ల తర్వాత తీర్పు..టేనెంట్ ను ఖాళీ చేయాలని ఆదేశాలు..!!

- January 05, 2025 , by Maagulf
31 ఏళ్ల తర్వాత తీర్పు..టేనెంట్ ను ఖాళీ చేయాలని ఆదేశాలు..!!

మనామా: సదరన్ మునిసిపాలిటీ 31 ఏళ్ల లీజు ఒప్పందాన్ని హై అప్పీల్స్ కోర్టు సమర్థించింది. టేనెంట్ ను ఖాళీ చేయమని కోర్టు ఆదేశించింది. మున్సిపాలిటీ 1981లో లీజును రద్దు చేయాలని, టేనెంట్ ను తొలగించాలని కోరుతూ దావా వేసింది. 1981లో కుదిరిన లీజు, స్క్రాప్ మెటల్ ట్రేడింగ్ కోసం నియమించబడిన 215,168 చదరపు అడుగుల భూమిని కేటాయించారు. కౌలుదారు, లీజు నిబంధనలను ఉల్లంఘించి, మున్సిపాలిటీకి తెలియకుండా లేదా అనుమతి లేకుండా 50,000 దీనార్‌లకు భూమిని సబ్‌లెట్ ఇచ్చాడు. అద్దెదారు లీజును మరొక పార్టీకి బదిలీ చేయడాన్ని మున్సిపాలిటీ తప్పుబట్టింది. కోర్టును ఆశ్రయించింది. దిగువ కోర్టు మొదట మున్సిపాలిటీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. లీజు రద్దు చేసింది. కాగా, సబ్ లెట్ కు మున్సిపాలిటీ నుంచి అనుమతి ఇచ్చిందని టేనెంట్ కోర్టుకు తెలిపారు. అయితే అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. ఒక కాంట్రాక్ట్ ఇరు పక్షాలపై కట్టుబడి ఉంటుందని, పరస్పర ఒప్పందం లేదా చట్టబద్ధంగా నిర్వచించబడిన కారణాల వల్ల తప్ప ఏకపక్షంగా మార్చడం లేదా రద్దు చేయడం సాధ్యం కాదని న్యాయమూర్తులు చెప్పారు. లీజులోసబ్‌లెట్ చేయడం నిషేధించబడిందని కోర్టు హైలైట్ చేసింది.  ఆటో మెటిక్ గా లీజు రద్దు అవుతుందని, ప్లేస్ ను తక్షణమే ఖాళీ చేయాలని తన తీర్పులో పేర్కొంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com