ఆంధ్రాలో వేలల్లో ఉద్యోగావకాశాలు.. సిలికాన్ కార్బైడ్ చిప్ల తయారీపై దృష్టి
- January 15, 2025
ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా భారీగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో రూ.14,000 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ చిప్ల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. అయితే భారత్ను అంతర్జాతీయ చిప్ల తయారీ కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి యాక్టీవ్ చర్యలు తీసుకుంటున్నాయి. జపాన్కు చెందిన యిటోవా మైక్రో టెక్నాలజీ లిమిటెడ్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ఆధారంగా ఆంధ్రాలోని కర్నూలు జిల్లాలోని పారిశ్రామిక పార్కులో జపాన్కు చెందిన కంపెనీ రూ.14,000 కోట్ల అంచనా వ్యయంతో సెమీకండక్టర్ చిప్ల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది.
సిలికాన్ కార్బైడ్ చిప్ల తయారీపై దృష్టి
భారతదేశంలో ఏర్పాటు చేసిన తొలి ప్రైవేట్ సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్ ఇదేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సిలికాన్ కార్బైడ్ చిప్ల తయారీపై కంపెనీ దృష్టి సారిస్తుందని ఆంధ్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నవంబర్లో సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 2024-29ని విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ల తయారీ హబ్గా మార్చడం దీని ముఖ్య లక్ష్యం. ఈ ప్రాజెక్టు కిందనే జపాన్ కంపెనీతో ఆంధ్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. కొత్త సిలికాన్ కార్పెట్ చిప్ తయారీ ప్లాంట్ నెలకు పది వేల వేఫర్లను ఉత్పత్తి చేస్తుందని అలాగే రాబోయే రెండు మూడేళ్లలో నెలకు యాభై వేల వేఫర్లకు ఉత్పత్తి పెరుగుతుందని అంచనా.
అంతర్జాతీయంగా కృత్రిమ మేధస్సు సాంకేతికత అండ్ వివిధ పరికరాలు స్మార్ట్ పరికరాలుగా మారడంతో స్మార్ట్ చిప్లకు డిమాండ్ కూడా పెరిగింది. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారత్ను సెమీకండక్టర్ల తయారీ హబ్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం వివిధ ప్రత్యేక పథకాలను కూడా ప్రకటించారు.
తాజా వార్తలు
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు
- గూగుల్కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!









