కుంభమేళాకు పోటెత్తిన భక్తులు..
- January 26, 2025
ప్రయాగ్ రాజ్: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా వైభవోపేతంగా జరుగుతోంది. ఈ మహాకుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.గంగ,యమున, సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. నాగసాధవులు, ఇతర భక్తులు భారీగా తరలివస్తున్నారు.
మరోవైపు ఈ నెల 29న మౌని అమావాస్య కావడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది యూపీ ప్రభుత్వం. ఆ ఒక్కరోజే దాదాపు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు అమృత స్నానం ఆచరించే అవకాశం ఉన్నందున 12 కిలోమీటర్ల పొడవైన దారిని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్, జనం రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక సిబ్బందిని మోహరించామన్నారు.
144 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక ఏర్పడనున్న ఈ సందర్భానికి ప్రత్యేకత ఉండటంతో భారీ రద్దీ నెలకొనబోతోందని అధికారులు తెలిపారు.ఇక మౌని అమావాస్య రోజున వీఐపీ జోన్ ఉండదని, ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండవని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ప్రయాగ్ రాజ్ లోకి వాహనాలను అనుమతించబోమని తెలిపింది.ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







