ఏపీ: రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోమ్’

- January 26, 2025 , by Maagulf
ఏపీ: రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోమ్’

అమరావతి: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ తేనీటి విందుకు కూట‌మి ప్రభుత్వ ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు తదితరులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌, మంత్రులు లోకేష్ స‌హా కూట‌మి ప్రభుత్వ ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు తదితరులు హాజరయ్యారు..

ఎట్ హోమ్ సందర్భంగా విచ్చేసిన‌ అతిథులకు గవర్నర్ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఆద్యంతం సరదాగా సాగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com