ఒమన్-ఇండియా ఆర్థిక సహకార పెంపు మార్గాలపై సమీక్ష..!!
- January 28, 2025
మస్కట్: ఇండియా వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ను ఇన్వెస్ట్ ఒమన్ లాంజ్లో ఒమన్ వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రి కైస్ మహమ్మద్ అల్ యూసఫ్ కలుసుకున్నారు. మస్కట్లో జరిగిన ఉమ్మడి ఒమానీ-ఇండియన్ కమిటీ 11వ సెషన్ ఫ్రేమ్వర్క్లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాల రంగాలలో సహకార రంగాలపై ఇరుపక్షాలు సమీక్షించాయి. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు వ్యూహాత్మక వేదికగా ఉమ్మడి ఒమానీ-భారత కమిటీ 11వ సెషన్ నిలిచింది.
ఒమన్ –ఇండియా మధ్య 2023లో రెండు దేశాల మధ్య వాణిజ్య మార్పిడి OMR2.05 బిలియన్లకు చేరుకుంది. ఒమన్లో భారతీయ పెట్టుబడుల విలువ OMR298.8 మిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









