హైదరాబాద్ మెట్రో: రెండు గంటల పాటు నిలిచిన మెట్రో సర్వీస్ లు
- January 29, 2025
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు నేటి ఉదయం నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో దాదాపు రెండు గంటలుగా నిలిచిపోయాయి మెట్రో రైళ్లు.దీంతో..హైదరాబాద్ వాసులు గందరగోళానికి గురైయ్యారు.సాంకేతిక కారణాలతో నాగోల్-రాయదుర్గం రూట్లో మెట్రో సేవల్లో ఆలస్యం అయింది.
అటు అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ, నాగోల్ నుంచి సికింద్రాబాద్, మియాపూర్ నుంచి అమీర్పేట్ మధ్య మెట్రో రైళ్లు ఆగిపోయాయి. ఉదయాన్నే ఆఫీస్ వేళలు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు.హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు నిలిచిపోవడంతో.. హైదరాబాద్ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.మెట్రో స్టేషన్లలో వేలాది సంఖ్యలో ప్రయాణికులు వచ్చి..నిలబడిపోయారు.రెండు గంటల తర్వాత మళ్లీ మెట్రో సర్వీస్ లు ప్రారంభమయ్యాయి…దీనిపై మెట్రో ఒక ప్రకటన విడుదల చేసింది.సిగ్నల్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్యలతోనే సర్వీస్ లకు అంతరాయం కలిగిందని పేర్కొంది.రెండు గంటల పాటు సర్వీస్ లు నిలిచిపోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది.ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని కోరింది.
తాజా వార్తలు
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!







