హైదరాబాద్ మెట్రో: రెండు గంటల పాటు నిలిచిన మెట్రో సర్వీస్ లు
- January 29, 2025
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు నేటి ఉదయం నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో దాదాపు రెండు గంటలుగా నిలిచిపోయాయి మెట్రో రైళ్లు.దీంతో..హైదరాబాద్ వాసులు గందరగోళానికి గురైయ్యారు.సాంకేతిక కారణాలతో నాగోల్-రాయదుర్గం రూట్లో మెట్రో సేవల్లో ఆలస్యం అయింది.
అటు అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ, నాగోల్ నుంచి సికింద్రాబాద్, మియాపూర్ నుంచి అమీర్పేట్ మధ్య మెట్రో రైళ్లు ఆగిపోయాయి. ఉదయాన్నే ఆఫీస్ వేళలు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు.హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు నిలిచిపోవడంతో.. హైదరాబాద్ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.మెట్రో స్టేషన్లలో వేలాది సంఖ్యలో ప్రయాణికులు వచ్చి..నిలబడిపోయారు.రెండు గంటల తర్వాత మళ్లీ మెట్రో సర్వీస్ లు ప్రారంభమయ్యాయి…దీనిపై మెట్రో ఒక ప్రకటన విడుదల చేసింది.సిగ్నల్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్యలతోనే సర్వీస్ లకు అంతరాయం కలిగిందని పేర్కొంది.రెండు గంటల పాటు సర్వీస్ లు నిలిచిపోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది.ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని కోరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









