లేబర్ డిస్పూట్.. మాజీ రెస్టారెంట్ జనరల్ మేనేజర్కు BD2,600..!!
- February 06, 2025
మనామా: లేబర్ డిస్పూట్ లో ఒక మాజీ జనరల్ మేనేజర్ విజయం సాధించారు. తనకు వేతన బకాయి ఉన్న తన మాజీ రెస్టారెంట్ యజమానిపై దావా వేసి పరిహారం పొందారు. బ్యాక్ పే, పరిహారం, వడ్డీతో సహా మొత్తం BD2,666.67ను అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. జనరల్ మేనేజర్ తరపు న్యాయవాది అలీ అల్ కస్సీర్ ప్రకారం.. తన క్లయింట్ కు హోటల్ యజమాని BD2,800 వేతన బకాయి చెల్లించలేదు. పైగా అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారు. అనేకసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో పరిహారం, వార్షిక సెలవు భత్యం, నోటీసు చెల్లింపు, ఎండ్-ఆఫ్-సర్వీస్ గ్రాట్యుటీ, కాంట్రాక్ట్ రద్దుకు పరిహారం ,విమాన టిక్కెట్ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోర్టులో దావా వేశారు. "ముందస్తు నోటీసు లేదా బకాయిలు చెల్లించకుండానే అతని ఉద్యోగం ఆకస్మికంగా రద్దు చేయబడటానికి ముందు నా క్లయింట్ BD400 నెలవారీ జీతంతో రెస్టారెంట్లో ఎనిమిది నెలలు పనిచేశాడు" అని లాయర్ లేబర్ కోర్టు ముందు వాదించారు. అయితే, హోటల్ యజమాని ఈ వాదనలను ఖండించారు. అతను రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నాడని.. ద్దె, విద్యుత్, సిబ్బంది జీతాలు, మెటీరియల్లు, పరికరాలు చెల్లింకుండా ఆ మొత్తాలను తన ఖాతాల్లో వేసుకున్నాడని ఆరోపించాడు. అయితే ఆ వాదనలను కోర్టు తోసిపుచ్చింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







