స్టాప్ఓవర్ ప్రోగ్రామ్.. జనవరిలో రికార్డుస్థాయిలో విజిటర్స్..!!
- February 06, 2025
దోహా, ఖతార్: ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ డెస్టినేషన్ మేనేజ్మెంట్ విభాగం డిస్కవర్ ఖతార్.. ఆగస్టు 2021లో ఖతార్ స్టాప్ఓవర్ ప్రోగ్రామ్ పునఃప్రారంభించింది. ఆ తర్వాత మొదటిసారిగా ఒకే నెలలో 10,000 మంది స్టాప్ఓవర్ సందర్శకులతో కీలక మైలురాయిని సాధించింది. జనవరి 2025లో ప్రోగ్రామ్ కింద 10,500 కంటే ఎక్కువ మంది సందర్శకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జనవరి 2024లో 6,651 మంది సందర్శకులు రాగా, 2024 మార్చి-జనవరి (2025) నాటికి 165% వృద్ధిని నమోదు చేసింది.అదే సమయంలో ఈ కార్యక్రమం హోటల్ బుకింగ్లలో అసాధారణమైన వృద్ధి నమోదైంది.ఈ సంవత్సరం ఇప్పటి వరకు 100,000 రూమ్ లు బుక్ అయ్యాయి.ఇది గత సంవత్సరం కంటే రెట్టింపు అని డిస్కవర్ కతార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్టీవెన్ రేనాల్డ్స్ తెలిపారు. ఖతార్ ఎయిర్వేస్ విస్తృతమైన నెట్వర్క్ను 170 గమ్యస్థానాలకు పెంచామని.. డిస్కవర్ ఖతార్లో, సాంస్కృతిక ఆవిష్కరణ, ప్రపంచ స్థాయి ఆతిథ్యం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులకు మరపురాని అనుభవాలను అనుకూలమైన ప్యాకేజీలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం







