రెసిడెన్సీ పర్మిట్ ఉల్లంఘించినవారికి.. మూడు నెలల గ్రేస్ పీరియడ్: ఖతార్
- February 09, 2025
దోహా, ఖతార్: రెసిడెన్సీ పర్మిట్ ఉల్లంఘించినవారు నిష్క్రమించడానికి ఖతార్ మూడు నెలల గ్రేస్ పీరియడ్ను ఖతార్ ప్రకటించింది. లా నం. (21) 2015 ఖతార్ రాష్ట్రం నుండి ప్రవాసుల ప్రవేశం, ఎగ్జిట్, రెసిడెన్సీని నియంత్రిస్తుంది.రెసిడెన్సీకి సంబంధించిన చట్ట నిబంధనలను ఉల్లంఘించిన వారికి లేదా ఎంట్రీ వీసా కింద దేశంలో ఆమోదించిన కాలాన్ని దాటిన వారికి ఇది వర్తిస్తుంది అని మంత్రిత్వ సోషల్ మీడియాలో తన ప్రకటనలో పేర్కొంది. గ్రేస్ పీరియడ్ ఫిబ్రవరి 9 ప్రారంభమవుతుంది. ఇది మూడు నెలల పాటు కొనసాగుతుంది. నిర్దేశిత వ్యవధిలోగా తమ ఎగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయడానికి, ఉల్లంఘించినవారు హమద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లవచ్చు లేదా అధికారిక పని వేళల్లో మధ్యాహ్నం 1 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సల్వా రోడ్లోని సెర్చ్ అండ్ ఫాలో-అప్ డిపార్ట్మెంట్ను సంప్రదించవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









