బహ్రెయిన్ లో పింఛన్ల కోసం అత్యవసర రిజర్వ్ ఫండ్..!!
- February 09, 2025
మనామా: పెన్షన్ల కోసం ప్రభుత్వ మద్దతుతో అత్యవసర రిజర్వ్ ఫండ్ను ఏర్పాటు చేసే ప్రతిపాదన పార్లమెంటు ముందుకు రానుంది.అదనపు ఖర్చులతో కార్మికులపై భారం పడకుండా పెన్షన్ చెల్లింపులను చేయనున్నారు.ఈ మేరకు మిగులు రాబడిని ఉపయోగించేందుకు ఈ ఫండ్ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఫ్యూచర్ జనరేషన్స్ రిజర్వ్ ఫండ్ మాదిరిగానే, ఈ పథకం అంతర్జాతీయ ఆస్తులలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెన్షన్ కొరత నుండి రక్షించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎంపీలు బాదర్ సలేహ్ అల్ తమీమి, అహ్మద్ సల్మాన్ అల్ ముసల్లం, మహ్మద్ అల్ అహ్మద్, డా. హిషామ్ అల్ అషిరి, హమద్ అల్ డోయ్ ప్రతిపాదించిన వారిలో ఉన్నారు. ఆరోగ్యకరమైన పెన్షన్ ఫండ్ను నిర్వహించడం కోసం ప్రస్తుత, భవిష్యత్తులో పదవీ విరమణ చేసిన వారికి బాధ్యతలను తీర్చడానికి ఆదాయాన్ని, ఖర్చులను బ్యాలెన్స్ చేయడం కోసం ఇది అత్యవసరమని ఎంపీలు పేర్కొన్నారు. దీనిని పార్లమెంట్ ఆమోదించబడినట్లయితే, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వివరించిన అంతర్జాతీయ పద్ధతులతో ఫండ్ పనిచేయనుంది. ఇది అత్యవసర పెన్షన్ నిల్వలు, భవిష్యత్తు పొదుపు వంటి ఉపయోగాల కోసం నిధులను వర్గీకరిస్తుంది. ఈ మార్పు బహ్రెయిన్ తన పెన్షన్ నిల్వలను నిర్వహించడానికి పెట్టుబడులపై ఆధారపడటానికి అనుమతిస్తుందని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









