బహ్రెయిన్ లో పింఛన్ల కోసం అత్యవసర రిజర్వ్ ఫండ్..!!
- February 09, 2025
మనామా: పెన్షన్ల కోసం ప్రభుత్వ మద్దతుతో అత్యవసర రిజర్వ్ ఫండ్ను ఏర్పాటు చేసే ప్రతిపాదన పార్లమెంటు ముందుకు రానుంది.అదనపు ఖర్చులతో కార్మికులపై భారం పడకుండా పెన్షన్ చెల్లింపులను చేయనున్నారు.ఈ మేరకు మిగులు రాబడిని ఉపయోగించేందుకు ఈ ఫండ్ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఫ్యూచర్ జనరేషన్స్ రిజర్వ్ ఫండ్ మాదిరిగానే, ఈ పథకం అంతర్జాతీయ ఆస్తులలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెన్షన్ కొరత నుండి రక్షించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎంపీలు బాదర్ సలేహ్ అల్ తమీమి, అహ్మద్ సల్మాన్ అల్ ముసల్లం, మహ్మద్ అల్ అహ్మద్, డా. హిషామ్ అల్ అషిరి, హమద్ అల్ డోయ్ ప్రతిపాదించిన వారిలో ఉన్నారు. ఆరోగ్యకరమైన పెన్షన్ ఫండ్ను నిర్వహించడం కోసం ప్రస్తుత, భవిష్యత్తులో పదవీ విరమణ చేసిన వారికి బాధ్యతలను తీర్చడానికి ఆదాయాన్ని, ఖర్చులను బ్యాలెన్స్ చేయడం కోసం ఇది అత్యవసరమని ఎంపీలు పేర్కొన్నారు. దీనిని పార్లమెంట్ ఆమోదించబడినట్లయితే, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వివరించిన అంతర్జాతీయ పద్ధతులతో ఫండ్ పనిచేయనుంది. ఇది అత్యవసర పెన్షన్ నిల్వలు, భవిష్యత్తు పొదుపు వంటి ఉపయోగాల కోసం నిధులను వర్గీకరిస్తుంది. ఈ మార్పు బహ్రెయిన్ తన పెన్షన్ నిల్వలను నిర్వహించడానికి పెట్టుబడులపై ఆధారపడటానికి అనుమతిస్తుందని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ







