ఉప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను పరీక్షించిన సీపీ సుధీర్ బాబు
- February 14, 2025
హైదరాబాద్: నేడు మరియు రేపు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న పదకొండవ ఎడిషన్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2025 టీ20 మ్యాచ్ ల సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, వివిధ భాషల సినిమా తారలు పాల్గొనే సెలబ్రిటీ క్రికెట్ పోటీలు కావటం వల్ల భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.ద్విచక్ర వాహనాలు మరియు కార్లకు విశాల ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా పరిసరాల శుభ్రతకు సంబంధించిన కేంద్రప్రభుత్వ స్వచ్ఛభారత్ పథకం ను ప్రమోట్ చేస్తూ ఏర్పాటు చేసిన హోర్డింగ్ మీద సీపీ సంతకం చేశారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







