ఉప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను పరీక్షించిన సీపీ సుధీర్ బాబు
- February 14, 2025
హైదరాబాద్: నేడు మరియు రేపు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న పదకొండవ ఎడిషన్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2025 టీ20 మ్యాచ్ ల సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, వివిధ భాషల సినిమా తారలు పాల్గొనే సెలబ్రిటీ క్రికెట్ పోటీలు కావటం వల్ల భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.ద్విచక్ర వాహనాలు మరియు కార్లకు విశాల ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా పరిసరాల శుభ్రతకు సంబంధించిన కేంద్రప్రభుత్వ స్వచ్ఛభారత్ పథకం ను ప్రమోట్ చేస్తూ ఏర్పాటు చేసిన హోర్డింగ్ మీద సీపీ సంతకం చేశారు.
తాజా వార్తలు
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం









