ఉప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను పరీక్షించిన సీపీ సుధీర్ బాబు
- February 14, 2025
హైదరాబాద్: నేడు మరియు రేపు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న పదకొండవ ఎడిషన్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2025 టీ20 మ్యాచ్ ల సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, వివిధ భాషల సినిమా తారలు పాల్గొనే సెలబ్రిటీ క్రికెట్ పోటీలు కావటం వల్ల భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.ద్విచక్ర వాహనాలు మరియు కార్లకు విశాల ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా పరిసరాల శుభ్రతకు సంబంధించిన కేంద్రప్రభుత్వ స్వచ్ఛభారత్ పథకం ను ప్రమోట్ చేస్తూ ఏర్పాటు చేసిన హోర్డింగ్ మీద సీపీ సంతకం చేశారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









